Pooja Hegde : వరుస సక్సెస్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డె. బుట్టబొమ్మ పూజా హెగ్డెకి కెరీర్ ఆరంభంలో పెద్దగా హిట్లు రాకున్నా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసిన ఈ భామ.. ఫామ్లోకి వచ్చిన తర్వాత మాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. తెలుగులోనే కాదు.. దక్షిణాది, ఉత్తరాది భాషల్లోనూ నటిస్తూ హవాను చూపిస్తోంది. నేషనల్ క్రష్గా మారిన పూజా హెగ్డె ఒకవైపు తన నటనతోపాటు అందచందాలతోనూ అలరిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ భామ అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంటుంది.
తాజాగా పూజా హెగ్డె.. తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. డెనిమ్ జీన్స్ తరహా పొట్టి డ్రెస్లో హోయలు పోయింది. మోకాళ్లపైకి ఉన్న గౌన్లో అందాల విందు చేస్తూ కుర్రకారుకి కంటిపై నిద్ర లేకుండా చేస్తోంది. ఉప్పొంగే ఎద ఎద అందాలు, కనువిందు చేసే హాట్ థైస్తో పూజా కుర్రాళ్లకి విజువల్ ట్రీట్నిచ్చిందని అంటున్నారు నెటిజన్లు. స్పెషల్ ట్రీట్ అదిరిపోయిందంటూ సంబరపడుతున్నారు. పండగ చేసుకుంటున్నారు. ఆ మధ్య మాల్దీవులకి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా బికినీలో సందడి చేసిన విషయం తెలిసిందే.
పూజా హెగ్డె టీనేజ్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన అందచందాలతో సందడి చేసి ఫేమస్ అయింది. అప్పుడే మూగమూడి అనే తమిళ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత వరుణ్ తేజ్ నటించిన ముకుందతో టాలీవుడ్లోకి వచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్యతో ఒక లైలా కోసం చేసింది. ఇవి మాత్రం ఆమెకు నిరాశనే మిగిల్చాయి. చాలా కాలం పాటు హిట్ కోసం వేచి చూసిన పూజా హెగ్డె అరవింద సమేత.. వీరరాఘవతో సక్సెస్ ట్రాక్ ఎక్కింది. అక్కడ నుండి మహర్షి, గద్దలకొండ గణేష్, అల.. వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్.. వంటి హిట్లను అందుకుంది. దీంతో టాలీవుడ్లో హవాను చూపిస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడి ఖాతాలో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…