Pooja Hegde : త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ తర్వాత దాదాపుగా మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ మూవీతో పలకరించారు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు ప్రకటించారు పవన్. ప్రస్తుతం మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను ‘భీమ్లా నాయక్’ టైటిల్తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోపాటు హరిహర వీరమల్లు అనే సినిమా కూడా చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్తో దేశ భక్తి నేపథ్యంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ విడుదల చేస్తూ మూవీ టైటిల్ ను ప్రకటించారు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ సమకాలీన రాజకీయాల అంశాలతోపాటు దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక లెక్చరర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎందుకు మారాడనేది ఆసక్తికరంగా చూపించనున్నారు.
చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించాడు హరీష్ శంకర్. అయితే పవన్ పొలిటికల్ కార్యక్రమాల వల్ల సినిమా షూటింగ్ లేట్ అవుతోంది. మరోవైపు పూజా హెగ్డే క్షణం కూడా తీరికలేని కాల్షీట్స్తో బిజీగా ఉంది. పవన్ సినిమా మొదలు పెట్టే సరికి పూజా తన కాల్షీట్స్ మేనేజ్ చేయగలుగుతుందా.. అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
పవన్ తన రాజకీయ కార్యక్రమాల వల్ల బిజీగా ఉండడంతో మూవీ షూటింగ్ ఆలస్యం అవుతోంది. అయితే అప్పటికి పూజా హెగ్డె ఇచ్చిన కాల్ షీట్స్ సమయం అయిపోతుంది. దీంతో మళ్లీ కొత్తగా కాల్ షీట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఆమెకు సమస్యగా మారనుంది. ఆమె ఫుల్ బిజీగా ఉండడంతో మళ్లీ కాల్ షీట్స్ను మార్చాల్సి వస్తుంది. మరి అందుకు ఆమె ఓకే చెబుతుందా.. పవన్ కోసం ఆగుతుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…