Pawan Kalyan : సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా హాజరైన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్లో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి పవర్ స్టార్ ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేశాడో మనం చూసాం. జగన్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాడు. ఈ ఈవెంట్ తర్వాత ఫిలిం ఛాంబర్.. పవన్ వ్యాఖ్యలకు, తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రెస్ నోట్ విడుదల చేసింది. కొందరు నిర్మాతలు కూడా పవన్ వ్యాఖ్యలను తప్పు పట్టారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో సినిమా ఈవెంట్కి గెస్ట్గా వస్తాడనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి.. శర్వానంద్ – బొమ్మరిల్లు సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో మహా సముద్రం సినిమా తెరకెక్కించాడు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
అక్టోబర్ 9 ఆదివారం సాయంత్రం 6 గంటలకు JRC కన్వెన్షన్ హాల్ లో ఈ కార్యక్రమం జరుగనుందని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా తీసుకురావాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ ఓకే అంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వాలని చూస్తున్నారట. ఈ ఫంక్షన్కి పవన్ వస్తే రిపబ్లిక్ ఈవెంట్ తరహాలో అదరగొడతాడా లేదంటే సినిమా గురించి మాట్లాడి వెళతారా అన్నది తేలాల్సి ఉంది. ‘మహా సముద్రం’ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…