Parasuram : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ధ ఘన విజయం సాధించి రికార్డుల వేట దిశగా కొనసాగుతోంది. ఆరంభంలో ఈ మూవీకి కాస్త నెగెటివ్ టాక్ వచ్చినా.. కావాలని కొందరు పనిగట్టుకుని నెగెటివ్ టాక్ను ప్రచారం చేశారని తెలిసింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే నెగెటివ్ టాక్ తగ్గింది. దీంతో సినిమా కలెక్షన్ల వేట దిశగా కొనసాగుతోంది. ఇక వరుసగా మూడో సినిమా కూడా హిట్ కావడంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ ఓ విషయంలో క్షమాపణలు చెప్పారు. అందుకు కారణం ఏమిటంటే..
సర్కారు వారి పాట మూవీలో సముద్రఖని విలన్గా చేసిన విషయం విదితమే. ఆయన ఓ సీన్లో మహేష్తో మాట్లాడుతూ తనను తాను నరసింహ స్వామితో పోల్చుకుంటాడు. ఏడాదంతా సింహాచలం నరసింహ స్వామిని చందనంతో కప్పి ఉంచుతారు. ఆయన నిజ స్వరూపాన్ని చూస్తే తట్టుకోలేరు.. అని అంటాడు. అయితే ఇలా ఒక విలన్ని స్వామి వారితో పోల్చడం ఏమిటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి పరశురామ్ స్పందించారు. ఆయన వారికి క్షమాపణలు చెప్పారు.
తాను విలన్ను స్వామి వారితో పోల్చుతూ డైలాగ్ రాయలేదని.. అది ఆశువుగా వచ్చేసిందని.. అంతేకానీ.. తాను స్వామి వారిని కించపరచలేదని.. ఒకవేళ ఎవరి మనోభావాలు అయినా దెబ్బ తిని ఉంటే.. అందుకు క్షమాపణలు చెబుతున్నానని.. పరశురామ్ అన్నారు. తాను సినిమా విడుదలకు ముందు, తరువాత సింహాచలం నరసింహ స్వామిని దర్శించుకున్నానని తెలిపారు. కాగా సర్కారు వారి పాట సినిమాలో మహేష్ పక్కన కీర్తి సురేష్ నటించగా.. ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…