Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ మధ్యే టిక్కెట్ల ధరలపై ఆసక్తికరమైన కామెంట్లు చేసిన విషయం విదితమే. ఆయన నిర్మించిన ఎఫ్3 మూవీ ఈ నెల 27వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో.. ఈ సినిమాకు సాధారణ టిక్కెట్ ధరలనే వసూలు చేస్తున్నామని.. టిక్కెట్ల ధరలను పెంచడం లేదని చెప్పారు. కానీ ఆయన మాట తప్పినట్లు అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి గాను బుకింగ్స్ను ప్రారంభించగా.. టిక్కెట్ల ధరలను పెంచి విక్రయిస్తున్నారు. ఒక్కో టిక్కెట్పై రూ.25 నుంచి రూ.45 వరకు పెంచారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్క టిక్కెట్ కు రూ.150, మల్టీప్లెక్సుల్లో అయితే రూ.250 గా ఉంది. అయితే వీటి ధరలను రూ.25 నుంచి రూ.45 మేర పెంచారు. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్క టిక్కెట్ ధర రూ.175, మల్టీప్లెక్సులలో ఒక్క టిక్కెట్ ధర రూ.295గా ఉంది. వీటికి ట్యాక్స్లు అదనం. ఈ క్రమంలోనే దిల్ రాజు తమ సినిమాకు టిక్కెట్ల ధరలను పెంచడం లేదని చెప్పారు కానీ.. ఆయన చెప్పిన మాటను తప్పారని క్లియర్గా అర్థమవుతోంది. ప్రస్తుతం పెంచిన ధరలకే టిక్కెట్లను విక్రయిస్తున్నారు.
ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం తమ సినిమా టిక్కెట్ ధరలను పెంచడం లేదని.. సాధారణ ధరలకే టిక్కెట్లను విక్రయిస్తున్నామని దిల్ రాజు ఇటీవల చెప్పారు. అలాగే ఎఫ్3 మూవీకి గాను పోస్టర్లపై కూడా ఇదే విషయాన్ని ప్రచారం చేశారు. సాధారణ ధరలకే టిక్కెట్లను విక్రయిస్తున్నామని.. అందరూ సినిమాను చూడాలని పోస్టర్స్ రిలీజ్ చేశారు. కానీ చివరకు సీన్ రివర్స్ చేశారు. టిక్కెట్ ధరలను పెంచారు. ఈ క్రమంలో ఫ్యామిలీ ఆడియెన్స్ అంత ఖర్చు పెట్టి ఈ మూవీని చూస్తారా.. అన్న సందేహం కలుగుతోంది. భారీ బడ్జెట్తో వచ్చిన రాధే శ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట వంటి చిత్రాలకే తొలి రోజు థియేటర్లలో సీట్లు ఖాళీగా కనిపించాయి. ఇక ఎఫ్3 మూవీకి కూడా టిక్కెట్లను పెంచారు. ఇది చిన్న సినిమా. స్టార్స్ ఉన్నప్పటికీ బడ్జెట్ తక్కువే. మరి ఈ సినిమాకు తొలి రోజు థియేటర్లలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది ? అన్న విషయం వేచి చూస్తే తెలుస్తుంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…