Dil Raju : మాట త‌ప్పిన దిల్ రాజు.. ఎఫ్3 మూవీకి టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచారుగా..!

May 22, 2022 12:54 PM

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ మ‌ధ్యే టిక్కెట్ల ధ‌ర‌ల‌పై ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేసిన విష‌యం విదిత‌మే. ఆయ‌న నిర్మించిన ఎఫ్3 మూవీ ఈ నెల 27వ తేదీన రిలీజ్ కానున్న నేప‌థ్యంలో.. ఈ సినిమాకు సాధార‌ణ టిక్కెట్ ధ‌ర‌ల‌నే వ‌సూలు చేస్తున్నామ‌ని.. టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచ‌డం లేద‌ని చెప్పారు. కానీ ఆయ‌న మాట త‌ప్పిన‌ట్లు అర్థం అవుతోంది. ప్ర‌స్తుతం ఈ మూవీకి గాను బుకింగ్స్‌ను ప్రారంభించ‌గా.. టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచి విక్ర‌యిస్తున్నారు. ఒక్కో టిక్కెట్‌పై రూ.25 నుంచి రూ.45 వ‌ర‌కు పెంచారు.

సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో ఒక్క టిక్కెట్ కు రూ.150, మ‌ల్టీప్లెక్సుల్లో అయితే రూ.250 గా ఉంది. అయితే వీటి ధ‌ర‌ల‌ను రూ.25 నుంచి రూ.45 మేర పెంచారు. దీంతో సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో ఒక్క టిక్కెట్ ధ‌ర రూ.175, మ‌ల్టీప్లెక్సుల‌లో ఒక్క టిక్కెట్ ధ‌ర రూ.295గా ఉంది. వీటికి ట్యాక్స్‌లు అద‌నం. ఈ క్ర‌మంలోనే దిల్ రాజు త‌మ సినిమాకు టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచ‌డం లేద‌ని చెప్పారు కానీ.. ఆయ‌న చెప్పిన మాట‌ను త‌ప్పార‌ని క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం పెంచిన ధ‌ర‌ల‌కే టిక్కెట్ల‌ను విక్ర‌యిస్తున్నారు.

Dil Raju false promise F3 movie ticket prices hiked
Dil Raju

ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం త‌మ సినిమా టిక్కెట్ ధ‌ర‌ల‌ను పెంచ‌డం లేద‌ని.. సాధార‌ణ ధ‌ర‌ల‌కే టిక్కెట్ల‌ను విక్ర‌యిస్తున్నామ‌ని దిల్ రాజు ఇటీవ‌ల చెప్పారు. అలాగే ఎఫ్3 మూవీకి గాను పోస్ట‌ర్‌ల‌పై కూడా ఇదే విష‌యాన్ని ప్ర‌చారం చేశారు. సాధార‌ణ ధ‌ర‌ల‌కే టిక్కెట్ల‌ను విక్ర‌యిస్తున్నామ‌ని.. అంద‌రూ సినిమాను చూడాల‌ని పోస్ట‌ర్స్ రిలీజ్ చేశారు. కానీ చివ‌ర‌కు సీన్ రివ‌ర్స్ చేశారు. టిక్కెట్ ధ‌ర‌ల‌ను పెంచారు. ఈ క్ర‌మంలో ఫ్యామిలీ ఆడియెన్స్ అంత ఖ‌ర్చు పెట్టి ఈ మూవీని చూస్తారా.. అన్న సందేహం క‌లుగుతోంది. భారీ బ‌డ్జెట్‌తో వ‌చ్చిన రాధే శ్యామ్, ఆచార్య‌, స‌ర్కారు వారి పాట వంటి చిత్రాల‌కే తొలి రోజు థియేట‌ర్ల‌లో సీట్లు ఖాళీగా క‌నిపించాయి. ఇక ఎఫ్3 మూవీకి కూడా టిక్కెట్ల‌ను పెంచారు. ఇది చిన్న సినిమా. స్టార్స్ ఉన్న‌ప్ప‌టికీ బ‌డ్జెట్ త‌క్కువే. మ‌రి ఈ సినిమాకు తొలి రోజు థియేట‌ర్ల‌లో ఎలాంటి ప‌రిస్థితి ఉంటుంది ? అన్న విష‌యం వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now