NTR Samantha : కొన్ని పెయిర్స్ ఎప్పుడు, ఎక్కడ కనిపించినా కూడా ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతుంటాయి. అలాంటి పెయిర్స్లో ఎన్టీఆర్ – సమంత పెయిర్ ఒకటి. వెండితెరపై వీరిద్దరూ కలిసి బృందావనం, రామయ్య వస్తావయ్యా, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలలో నటించి మెప్పించారు. ఇప్పుడు బుల్లితెరపై ఎన్టీఆర్తో కలిసి సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి సమంత చీఫ్ గెస్ట్గా హాజరైంది. దసరా నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఈ స్పెషల్ ఎపిసోడ్ను ప్రసారం చేయనున్నారు.
తాజాగా ప్రోమో విడుదల చేయగా ఇందులో ఎన్టీఆర్ – సమంతల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘కూర్చొంటే భయంగా ఉంది’ అని సమంత అనగా, ‘ఉంటుంది. ఇది హోస్ట్ సీట్.. అది హాట్ సీట్’ అంటూ ఎన్టీఆర్ సమాధానమిచ్చారు. ‘సాధారణంగా ఎవరైనా వెయ్యి నుంచి కోటికి వెళ్తారు.. నువ్వు కోటి నుంచి వెయ్యికి వస్తే ఆట బాగుంటుంది కదా’ అని ఎన్టీఆర్ అనడంతో సమంత నవ్వేసింది. ఆ తర్వాత ‘వదిలేయనా డబ్బు’ అని సమంత అనగా, ‘అయితే, క్విట్ అయిపోతావా’ అని ఎన్టీఆర్ అడిగారు. ‘మీరు ఇప్పుడు చెబుతున్నారు. ముందే చెప్పాలి కదా’ అని సమంత చెప్పుకొచ్చింది.
మంచి ఎంటర్టైనింగ్ గా కట్ చేసిన ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో 2.2 మిలియన్ కి పైగా వ్యూస్ తో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇక ప్రోమోనే ఇంతలా సందడి చేస్తుంటే, ప్రోగ్రాం ఎంత రచ్చ చేస్తుందో చూడాలి. విడాకుల తరువాత సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్యపు వార్తలను పట్టించుకోకుండా తన మనోధైర్యంతో మొదటిసారిగా ఈ గేమ్ షోలో అతిథిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తాను స్ట్రాంగ్ అని సమంత నిరూపించుకుంది. అందుకే ఈ షోపై అందరిలోనూ అంత ఆసక్తి నెలకొంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…