Ramya Krishnan : తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎంతో కాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. పెళ్లి వల్ల ఇండస్ట్రీకి కొంత కాలం పాటు దూరం అయినా.. తరువాత తల్లి, అత్త వంటి పాత్రల్లో నటిస్తూ అలరిస్తోంది. ఇక బాహుబలిలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించింది. ఈ క్రమంలోనే ఆమె శివగామిగా పాపులర్ అయ్యారు. అయితే అప్పట్లో ఎన్టీఆర్తో చేసిన ఓ సినిమాలో ఓ పాట సందర్బంగా ఆయన రమ్యకృష్ణకు సారీ చెప్పారు. అయితే అందుకు రమ్యకృష్ణ కూడా ఫర్వాలేదని సమాధానమిచ్చారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
అప్పట్లో ఎన్టీఆర్, భూమిక, అంకిత హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఎన్టీఆర్ పూర్తి మాస్ క్యారెక్టర్లో అలరించారు. అయితే ఇదే మూవీలో ఓ ఐటమ్ సాంగ్లో రమ్యకృష్ణ చేశారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణతో డ్యాన్స్ చేసేందుకు ఎన్టీఆర్ ఇబ్బందులు పడ్డారట. అసలు ఈ ఐటమ్ సాంగ్లో రమ్యకృష్ణ చేస్తుంది అనగానే ఎన్టీఆర్ తనకు ఓకే కానీ.. ఆమె సీనియర్ నటి కదా.. ఐటమ్ సాంగ్కు ఒప్పుకుంటారా.. అని ఎన్టీఆర్ అడిగాడట. అయితే ఎన్టీఆర్తో కలసి డ్యాన్స్ చేయాలని చెప్పగానే ఆమె ఉత్సాహంగా ఓకే చెప్పారట. దీంతో ఐటమ్ సాంగ్ పూర్తయింది.
అయితే ఐటమ్ సాంగ్ చేస్తున్న సమయంలో రమ్యకృష్ణ కన్నా ఎన్టీఆరే తెగ ఇబ్బంది పడ్డాడట. ఆమెను వీలైనంత వరకు టచ్ చేయకుండానే డ్యాన్స్ చేద్దామని ట్రై చేశాడట. కానీ వీలు కాలేదు. దీంతో ఐటమ్ సాంగ్ చేశాక తారక్ ఆమెకు సారీ చెప్పాడట. అయితే ఇందులో సారీ చెప్పాల్సింది ఏముంది.. ఇది యాక్టింగే కదా.. ఫర్వాలేదు.. డ్యాన్స్ బాగా చేశారు.. అంటూ ఆమె తారక్ను పొడిగారట. అలా సింహాద్రి ఐటమ్ సాంగ్ చేశారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఈ సాంగ్ పట్ల నెగెటివ్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్ ఆమెను బాగా నలిపేశాడని అన్నారు. కానీ వాస్తవానికి జరిగింది అది. అయితే ఇవన్నీ పక్కన పెట్టిన ప్రేక్షకులు సినిమాను మాత్రం సూపర్ డూపర్ హిట్ చేశారు. ఇది ఎన్టీఆర్ కెరీర్ లో ఒక బెస్ట్ మూవీగా నిలిచిందని చెప్పవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…