Ramya Krishnan : తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎంతో కాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. పెళ్లి వల్ల ఇండస్ట్రీకి కొంత కాలం పాటు దూరం అయినా.. తరువాత తల్లి, అత్త వంటి పాత్రల్లో నటిస్తూ అలరిస్తోంది. ఇక బాహుబలిలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించింది. ఈ క్రమంలోనే ఆమె శివగామిగా పాపులర్ అయ్యారు. అయితే అప్పట్లో ఎన్టీఆర్తో చేసిన ఓ సినిమాలో ఓ పాట సందర్బంగా ఆయన రమ్యకృష్ణకు సారీ చెప్పారు. అయితే అందుకు రమ్యకృష్ణ కూడా ఫర్వాలేదని సమాధానమిచ్చారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
అప్పట్లో ఎన్టీఆర్, భూమిక, అంకిత హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఎన్టీఆర్ పూర్తి మాస్ క్యారెక్టర్లో అలరించారు. అయితే ఇదే మూవీలో ఓ ఐటమ్ సాంగ్లో రమ్యకృష్ణ చేశారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణతో డ్యాన్స్ చేసేందుకు ఎన్టీఆర్ ఇబ్బందులు పడ్డారట. అసలు ఈ ఐటమ్ సాంగ్లో రమ్యకృష్ణ చేస్తుంది అనగానే ఎన్టీఆర్ తనకు ఓకే కానీ.. ఆమె సీనియర్ నటి కదా.. ఐటమ్ సాంగ్కు ఒప్పుకుంటారా.. అని ఎన్టీఆర్ అడిగాడట. అయితే ఎన్టీఆర్తో కలసి డ్యాన్స్ చేయాలని చెప్పగానే ఆమె ఉత్సాహంగా ఓకే చెప్పారట. దీంతో ఐటమ్ సాంగ్ పూర్తయింది.
అయితే ఐటమ్ సాంగ్ చేస్తున్న సమయంలో రమ్యకృష్ణ కన్నా ఎన్టీఆరే తెగ ఇబ్బంది పడ్డాడట. ఆమెను వీలైనంత వరకు టచ్ చేయకుండానే డ్యాన్స్ చేద్దామని ట్రై చేశాడట. కానీ వీలు కాలేదు. దీంతో ఐటమ్ సాంగ్ చేశాక తారక్ ఆమెకు సారీ చెప్పాడట. అయితే ఇందులో సారీ చెప్పాల్సింది ఏముంది.. ఇది యాక్టింగే కదా.. ఫర్వాలేదు.. డ్యాన్స్ బాగా చేశారు.. అంటూ ఆమె తారక్ను పొడిగారట. అలా సింహాద్రి ఐటమ్ సాంగ్ చేశారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఈ సాంగ్ పట్ల నెగెటివ్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్ ఆమెను బాగా నలిపేశాడని అన్నారు. కానీ వాస్తవానికి జరిగింది అది. అయితే ఇవన్నీ పక్కన పెట్టిన ప్రేక్షకులు సినిమాను మాత్రం సూపర్ డూపర్ హిట్ చేశారు. ఇది ఎన్టీఆర్ కెరీర్ లో ఒక బెస్ట్ మూవీగా నిలిచిందని చెప్పవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…