NTR : గత పది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని కడప, చిత్తూరు జిల్లాలో కురిసిన అధిక వర్షాల కారణంగా ఎన్నో గ్రామాలు చెరువులను తలపించాయి. అధిక వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వాగులు, వంకలు పొంగి పొర్లడంతో గ్రామాలన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల పాటు జనజీవనం స్తంభించిపోయింది. అదే విధంగా ఎంతో మంది నిరాశ్రయులుగా మారిపోయారు. ఎంతో మంది రైతులు చేతికొచ్చిన పంట నీటిలో కొట్టుకుపోతుంటే చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
ఇలా అకాల వర్షాల కారణంగా ఎంతో నష్టపోయిన వారి కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వరద బాధితుల కోసం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా వరద బాధితులను చూసి చలించిపోయిన ఎన్టీఆర్ తన వంతు సహాయంగా వరద బాధితుల కోసం 25 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు.
ఈ క్రమంలోనే వరద బాధితుల కోసం తాను అండగా నిలిచినట్లు.. వరద బాధితుల కోసం 25 లక్షల రూపాయలను విరాళంగా అందించిన విషయాన్ని తారక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తారక్ సినిమాల విషయానికొస్తే ఆయన నటించిన RRR సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…