NTR : గత పది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని కడప, చిత్తూరు జిల్లాలో కురిసిన అధిక వర్షాల కారణంగా ఎన్నో గ్రామాలు చెరువులను తలపించాయి. అధిక వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వాగులు, వంకలు పొంగి పొర్లడంతో గ్రామాలన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల పాటు జనజీవనం స్తంభించిపోయింది. అదే విధంగా ఎంతో మంది నిరాశ్రయులుగా మారిపోయారు. ఎంతో మంది రైతులు చేతికొచ్చిన పంట నీటిలో కొట్టుకుపోతుంటే చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
ఇలా అకాల వర్షాల కారణంగా ఎంతో నష్టపోయిన వారి కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వరద బాధితుల కోసం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా వరద బాధితులను చూసి చలించిపోయిన ఎన్టీఆర్ తన వంతు సహాయంగా వరద బాధితుల కోసం 25 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు.
ఈ క్రమంలోనే వరద బాధితుల కోసం తాను అండగా నిలిచినట్లు.. వరద బాధితుల కోసం 25 లక్షల రూపాయలను విరాళంగా అందించిన విషయాన్ని తారక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తారక్ సినిమాల విషయానికొస్తే ఆయన నటించిన RRR సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…