NTR : గత పది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని కడప, చిత్తూరు జిల్లాలో కురిసిన అధిక వర్షాల కారణంగా ఎన్నో గ్రామాలు చెరువులను తలపించాయి. అధిక వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వాగులు, వంకలు పొంగి పొర్లడంతో గ్రామాలన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల పాటు జనజీవనం స్తంభించిపోయింది. అదే విధంగా ఎంతో మంది నిరాశ్రయులుగా మారిపోయారు. ఎంతో మంది రైతులు చేతికొచ్చిన పంట నీటిలో కొట్టుకుపోతుంటే చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
ఇలా అకాల వర్షాల కారణంగా ఎంతో నష్టపోయిన వారి కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వరద బాధితుల కోసం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా వరద బాధితులను చూసి చలించిపోయిన ఎన్టీఆర్ తన వంతు సహాయంగా వరద బాధితుల కోసం 25 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు.
ఈ క్రమంలోనే వరద బాధితుల కోసం తాను అండగా నిలిచినట్లు.. వరద బాధితుల కోసం 25 లక్షల రూపాయలను విరాళంగా అందించిన విషయాన్ని తారక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తారక్ సినిమాల విషయానికొస్తే ఆయన నటించిన RRR సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…