NTR : అప్పటి తరం మన హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ప్రతి ఒక్కరూ స్వయంకృషితో పైకి వచ్చినవారే. నటనపై మక్కువతో ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. సినీ ఇండస్ట్రీకి మూల స్తంభాలుగా నిలిచారు. 1980 కి ముందు చెన్నైలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది. ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలో తెలుగు సినీ పరిశ్రమ తమిళనాడు నుంచి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులు జరిగాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్ లో నిలబెట్టడం కోసం అప్పటి తరం మన స్టార్ హీరోలు ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ వంటి వారు ఎంతో గొప్ప కృషి చేశారు.
వీరితో పాటు దర్శక నిర్మాతలు దాసరి నారాయణరావు, డి.రామానాయుడు కూడా ఇండస్ట్రీకి కొత్త రూపాన్ని తీసుకువచ్చారు. అంతేకాకుండా అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్, కృష్ణ పద్మాలయా స్టూడియోస్, దగ్గుబాటి సురేష్ ప్రొడక్షన్స్ వంటి ఎన్నో నిర్మాణ సంస్థలు ప్రారంభమయ్యాయి. ఎన్ని నిర్మాణ సంస్థలు ప్రారంభమైనా సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పటికీ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
అప్పట్లో మన అగ్రస్థాయి హీరోలకి ఇప్పటి తరం హీరోలు మాదిరిగా కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఉండేది కాదు. కేవలం ఎన్టీఆర్ చిత్రాలకు మాత్రమే రూ.50 లక్షల వరకు అధిక బడ్జెట్ ఉండేది. అంటే అప్పట్లో ఎన్టీఆర్ చిత్రాలు మాత్రమే అత్యధిక బడ్జెట్ చిత్రాలు. దక్షిణ భారతదేశం మొత్తంలో భారీ పారితోషికం అందుకొనే వారి లిస్ట్ లో ఎన్టీఆర్ ముందు ఉండేవారు. ఎన్టీఆర్ కేవలం ఒక్క సినిమాకి రూ.12 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునే వారట.
ఆ తర్వాత ఏఎన్నార్ సినిమాలకు రూ.30 నుండి రూ.40 లక్షల బడ్జెట్ అయ్యేదట. ఏఎన్నార్ కూడా అప్పట్లో ఒక సినిమాకి రూ.10 లక్షలు తీసుకునేవారట. తర్వాత లిస్టులో మూడవ వారు కృష్ణ. ఒక్క సినిమాకి రూ.7 లక్షల రెమ్యూనరేషన్ అందుకునేవారట. ఇక శోభన్ బాబు కూడా రూ.6 నుంచి రూ.7 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకునేవారట. తర్వాత తరంలో వచ్చిన చిరంజీవి, సుమన్ రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు ఒక్కొక్క సినిమాకి పారితోషికంగా అందుకునేవారట. సుమన్, చిరంజీవి చిత్రాలకు కూడా అప్పట్లో రూ.17 లక్షల వరకు బడ్జెట్ అయ్యేదని సమాచారం. ఇలా అప్పట్లో వారు పారితోషికాలు అందుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం చిన్న హీరోలు అయినా సరే రూ.కోట్లలో రెమ్యునరేషన్లను తీసుకుంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…