Tollywood : లేడీ సూపర్ స్టార్గా పేరుగాంచిన నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మళయాళీ అయినప్పటికీ తమిళం, తెలుగు సినిమాల్లోనూ నటించింది. అయితే ఈమెకు తెలుగు సినిమాల ద్వారానే మంచి గుర్తింపు లభించింది. దీంతో ఈమెకు ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. తరువాత తమిళ సినిమా ఇండస్ట్రీకి మారిపోయింది. తెలుగులో పెద్దగా మూవీలు చేయడం లేదు. కానీ టాలీవుడ్ ద్వారానే నయనతార మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె నటించిన దుబాయ్ శ్రీను, ప్రభాస్ యోగి.. ఇతర చిత్రాలు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అయితే తన పెళ్లికి ఒక్క తెలుగు యాక్టర్ను కూడా ఆమె పిలవలేదట. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
నయనతార, విగ్నేష్ శివన్ల వివాహం మహాబలిపురంలో గురువారం గ్రాండ్ షెరటాన్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ దంపతులు తమిళనాడులోని పలు ఆలయాలతోపాటు ఇతర ప్రదేశాల్లో మొత్తం 1 లక్ష మందికి అన్నదానం చేశారు. వీరి వివాహానికి రజనీకాంత్, షారూఖ్ ఖాన్ వంటి స్టార్స్ హాజరయ్యారు. అయితే ఈమె పెళ్లికి టాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా హాజరు కాకపోవడం విస్మయానికి గురి చేసింది. అయితే ఈమె ఒక్క తెలుగు యాక్టర్ను కూడా తన పెళ్లికి పిలవలేదట. అందుకనే తెలుగు యాక్టర్లు అసలు ఈమె పెళ్లిలో కనిపించలేదట. మరి ఈమె ఎందుకిలా చేసిందని గుసగుసలాడుకుంటున్నారు.
సాధారణంగా కోలీవుడ్ లేదా బాలీవుడ్లలో ఎక్కడ ఏదైనా శుభకార్యం లేదా ముఖ్యమైన వేడుక జరిగితే టాలీవుడ్ కు చెందిన పలువురికి ఆహ్వానాలు అందుతాయి. కానీ నయనతార మాత్రం తెలుగును పూర్తిగా విస్మరించినట్లు తెలుస్తోంది. కనీసం అగ్ర హీరోలకు అయినా సరే ఈమె ఆహ్వానాలు పంపలేదట. దీంతో ఆయా హీరోలకు చెందిన ఫ్యాన్స్ నయన్పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె కనీసం టాలీవుడ్ను పట్టించుకోలేదని అంటున్నారు. అయితే దీని వెనుక కారణం ఏమున్నప్పటికీ ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…