Tollywood : లేడీ సూపర్ స్టార్గా పేరుగాంచిన నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మళయాళీ అయినప్పటికీ తమిళం, తెలుగు సినిమాల్లోనూ నటించింది. అయితే ఈమెకు తెలుగు సినిమాల ద్వారానే మంచి గుర్తింపు లభించింది. దీంతో ఈమెకు ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. తరువాత తమిళ సినిమా ఇండస్ట్రీకి మారిపోయింది. తెలుగులో పెద్దగా మూవీలు చేయడం లేదు. కానీ టాలీవుడ్ ద్వారానే నయనతార మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె నటించిన దుబాయ్ శ్రీను, ప్రభాస్ యోగి.. ఇతర చిత్రాలు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అయితే తన పెళ్లికి ఒక్క తెలుగు యాక్టర్ను కూడా ఆమె పిలవలేదట. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
నయనతార, విగ్నేష్ శివన్ల వివాహం మహాబలిపురంలో గురువారం గ్రాండ్ షెరటాన్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ దంపతులు తమిళనాడులోని పలు ఆలయాలతోపాటు ఇతర ప్రదేశాల్లో మొత్తం 1 లక్ష మందికి అన్నదానం చేశారు. వీరి వివాహానికి రజనీకాంత్, షారూఖ్ ఖాన్ వంటి స్టార్స్ హాజరయ్యారు. అయితే ఈమె పెళ్లికి టాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా హాజరు కాకపోవడం విస్మయానికి గురి చేసింది. అయితే ఈమె ఒక్క తెలుగు యాక్టర్ను కూడా తన పెళ్లికి పిలవలేదట. అందుకనే తెలుగు యాక్టర్లు అసలు ఈమె పెళ్లిలో కనిపించలేదట. మరి ఈమె ఎందుకిలా చేసిందని గుసగుసలాడుకుంటున్నారు.
సాధారణంగా కోలీవుడ్ లేదా బాలీవుడ్లలో ఎక్కడ ఏదైనా శుభకార్యం లేదా ముఖ్యమైన వేడుక జరిగితే టాలీవుడ్ కు చెందిన పలువురికి ఆహ్వానాలు అందుతాయి. కానీ నయనతార మాత్రం తెలుగును పూర్తిగా విస్మరించినట్లు తెలుస్తోంది. కనీసం అగ్ర హీరోలకు అయినా సరే ఈమె ఆహ్వానాలు పంపలేదట. దీంతో ఆయా హీరోలకు చెందిన ఫ్యాన్స్ నయన్పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె కనీసం టాలీవుడ్ను పట్టించుకోలేదని అంటున్నారు. అయితే దీని వెనుక కారణం ఏమున్నప్పటికీ ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…