Nivetha Thomas : తెలుగు ప్రేక్షకులకు నచ్చిన హీరోయిన్లలో మలయాళ బ్యూటీ నివేతా థామస్ ఒకరు. నేచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మెన్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది ఈ యంగ్ హీరోయిన్. ఆ తర్వాత రెండు, మూడేండ్ల పాటు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన నిన్ను కోరి చిత్రంలో నటించింది నివేతా. ఆ మూవీ క్లాసిక్ హిట్ గా నిలిచింది. అప్పటి నుంచి ఆమె నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది.
గతేడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. తాజాగా దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేతా ప్రధాన పాత్రల్లో నటించిన శాఖిని డాకిని చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్ర యూనిట్ ప్రమోషన్లను కూడా ప్రారంభించింది. తాజాగా రెజీనా కాసాండ్రా తో కలిసి నివేదా ప్రమోషన్లలో కనిపించింది. నివేతాను చూసిన ఆమె అభిమానులు అరెరే.. నివేతా ఏంటి ఇలా అయిపోయింది? అని ఆశ్చర్యపోతున్నారు.
బ్లాక్ డ్రెస్ లో అందంగా కనిపించిన నివేతా గతంలో కంటే కాస్త లావుగా కనిపిస్తుంది. గతంలో ఉన్న కల ముఖంలో కనిపించడం లేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి అల్లరి, యాక్టివ్ నెస్ తగ్గిపోయిందంటూ కొంత డిస్పాయింట్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్. ప్రస్తుతం దృశ్యం 2 దర్శకుడు జీతూ జోసెఫ్ రీమేక్ చేస్తున్న పాపనాశం 2 లో కూడా నటిస్తుంది నివేతా. ఈ సినిమాలో కమల్ హాసన్ కూతురి పాత్రలో నివేతా థామస్ నటిస్తున్నారు. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా నివేతా నటిస్తుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…