Naga Babu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మెగా బ్రదర్ నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి జోహార్లు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గురించి నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల వైసీపీ అభిమానులు, కార్యకర్తలు నాగబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు నాగబాబు ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. జంగారెడ్డిగూడెంలో గత రెండు రోజుల క్రితం ఏకంగా 18 మంది కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రతిపక్షం ఈ మరణాలు కల్తీ సారాయి వల్ల జరిగాయని ప్రభుత్వంపై విమర్శలు చేసింది. కానీ ఇవి సహజ మరణాలేనని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ క్రమంలోనే ఈ మరణాల పట్ల మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. జంగారెడ్డి గూడెంలో జరిగిన దుర్ఘటన తెలుసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఎంతో ఊరట కలిగించాయి. మొదట్లో మీడియా, డాక్టర్ల వల్ల.. ఈ మరణాలు అన్నీ కల్తీసారా వల్ల జరిగాయని పొరపాటు పడ్డాను. కానీ మన ముఖ్యమంత్రి తన ప్రత్యేక డిక్షనరీ ద్వారా ఇవి సహజ మరణాలని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాను. ఇలా చనిపోయిన వారందరూ ఒకే లక్షణాలు కలిగి ఉండి ఒకే ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ ఈ మరణాలు కల్తీసారా వల్ల కలగలేదని సహజ మరణాలు అని తేల్చి చెప్పిన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జోహార్లు.. అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.
నాగబాబు జగన్మోహన్ రెడ్డి పై చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా చనిపోయినవారికి జోహార్లు చెబుతాము.. అలాంటిది నాగబాబు చేసిన పోస్ట్ పై వైసీపీ అభిమానులు స్పందిస్తూ.. విమర్శలు చేసినా హుందాగా ఉండాలి కానీ ఇలా స్థాయి దిగజార్చుకొనేలా ఉండకూడదు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలి కానీ ఇలా చివరిలో మీరు రాసిన అవివేకానికి జోహార్లు.. అనే వాక్యం సరికాదని.. జగన్ అభిమానులు నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌంటర్లు వేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…