Naga Babu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మెగా బ్రదర్ నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి జోహార్లు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గురించి నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల వైసీపీ అభిమానులు, కార్యకర్తలు నాగబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు నాగబాబు ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. జంగారెడ్డిగూడెంలో గత రెండు రోజుల క్రితం ఏకంగా 18 మంది కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రతిపక్షం ఈ మరణాలు కల్తీ సారాయి వల్ల జరిగాయని ప్రభుత్వంపై విమర్శలు చేసింది. కానీ ఇవి సహజ మరణాలేనని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ క్రమంలోనే ఈ మరణాల పట్ల మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. జంగారెడ్డి గూడెంలో జరిగిన దుర్ఘటన తెలుసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఎంతో ఊరట కలిగించాయి. మొదట్లో మీడియా, డాక్టర్ల వల్ల.. ఈ మరణాలు అన్నీ కల్తీసారా వల్ల జరిగాయని పొరపాటు పడ్డాను. కానీ మన ముఖ్యమంత్రి తన ప్రత్యేక డిక్షనరీ ద్వారా ఇవి సహజ మరణాలని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాను. ఇలా చనిపోయిన వారందరూ ఒకే లక్షణాలు కలిగి ఉండి ఒకే ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ ఈ మరణాలు కల్తీసారా వల్ల కలగలేదని సహజ మరణాలు అని తేల్చి చెప్పిన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జోహార్లు.. అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.
నాగబాబు జగన్మోహన్ రెడ్డి పై చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా చనిపోయినవారికి జోహార్లు చెబుతాము.. అలాంటిది నాగబాబు చేసిన పోస్ట్ పై వైసీపీ అభిమానులు స్పందిస్తూ.. విమర్శలు చేసినా హుందాగా ఉండాలి కానీ ఇలా స్థాయి దిగజార్చుకొనేలా ఉండకూడదు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలి కానీ ఇలా చివరిలో మీరు రాసిన అవివేకానికి జోహార్లు.. అనే వాక్యం సరికాదని.. జగన్ అభిమానులు నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌంటర్లు వేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…