Naga Babu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మెగా బ్రదర్ నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి జోహార్లు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గురించి నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల వైసీపీ అభిమానులు, కార్యకర్తలు నాగబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు నాగబాబు ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. జంగారెడ్డిగూడెంలో గత రెండు రోజుల క్రితం ఏకంగా 18 మంది కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రతిపక్షం ఈ మరణాలు కల్తీ సారాయి వల్ల జరిగాయని ప్రభుత్వంపై విమర్శలు చేసింది. కానీ ఇవి సహజ మరణాలేనని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ క్రమంలోనే ఈ మరణాల పట్ల మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. జంగారెడ్డి గూడెంలో జరిగిన దుర్ఘటన తెలుసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఎంతో ఊరట కలిగించాయి. మొదట్లో మీడియా, డాక్టర్ల వల్ల.. ఈ మరణాలు అన్నీ కల్తీసారా వల్ల జరిగాయని పొరపాటు పడ్డాను. కానీ మన ముఖ్యమంత్రి తన ప్రత్యేక డిక్షనరీ ద్వారా ఇవి సహజ మరణాలని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాను. ఇలా చనిపోయిన వారందరూ ఒకే లక్షణాలు కలిగి ఉండి ఒకే ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ ఈ మరణాలు కల్తీసారా వల్ల కలగలేదని సహజ మరణాలు అని తేల్చి చెప్పిన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జోహార్లు.. అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.
నాగబాబు జగన్మోహన్ రెడ్డి పై చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా చనిపోయినవారికి జోహార్లు చెబుతాము.. అలాంటిది నాగబాబు చేసిన పోస్ట్ పై వైసీపీ అభిమానులు స్పందిస్తూ.. విమర్శలు చేసినా హుందాగా ఉండాలి కానీ ఇలా స్థాయి దిగజార్చుకొనేలా ఉండకూడదు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలి కానీ ఇలా చివరిలో మీరు రాసిన అవివేకానికి జోహార్లు.. అనే వాక్యం సరికాదని.. జగన్ అభిమానులు నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌంటర్లు వేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…