Manchu Vishnu : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటవారసులుగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు మంచు విష్ణు, మనోజ్. ఈ ఇద్దరూ పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయారు. అయితే ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా మంచు విష్ణు సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం సూర్య అనే డెబ్యూ డైరెక్టర్తో ఓ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు అనే పాత్రను పోషిస్తున్నారు విష్ణు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో సన్నీలియోన్ రేణుక అనే పాత్రలో నటిస్తోంది.
షూటింగ్ సంగతేమో కానీ సన్నీలియోన్తో విష్ణు చేస్తున్న సందడి మాములుగా ఉండడం లేదు. ఇటీవల ఓ వీడియో పోస్ట్ చేయగా అందులో సన్నీలియోన్.. మంచు విష్ణుని భయపెట్టిస్తున్నట్టుగా కనిపించింది. మాస్కుతో ఆమె భయపెట్టినా భయపడని విష్ణు.. ఫేస్ మాస్కుతీసేయగానే భయపడ్డాడు. బ్యాక్ గ్రౌండ్ లో చూపే బంగారమాయేనే శ్రీవల్లి.. పాట పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇక తాజాగా సన్నీ లియోన్.. మంచు విష్ణు ఇంట్లో పరోటాలు చేసింది. తన కిచెన్ లో సన్నీలియోన్ తన కోసం పరోటాలు చేస్తుందంటూ విష్ణు వీడియోను షేర్ చేశాడు.
వీడియోలో సన్నీ లియోన్, మంచు విష్ణు ఇద్దరూ ఇంగ్లిష్లో మాట్లాడుకుంటున్నారు. పరోటా చేయడంలో మెలుకువలు కూడా నేర్పిస్తున్నాడు విష్ణు. అయితే సన్నీ లియోన్ వీపుపై ఆమ్లెట్ కూడావేయొచ్చు అని మంచు విష్ణు కామెంట్ చేయడంతో ఇప్పుడు ఆయనని తెగ ఆడేసుకుంటున్నారు. గతంలోనూ విష్ణుపై తెగ ట్రోలింగ్ నడిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గాలి నాగేశ్వరరావు చిత్రంలో పాయల్ రాజ్పుత్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని చిత్ర బృందం చెబుతోంది.
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…
మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే…
భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…
మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ పవన్…