Kajal Aggarwal : కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ మాతృత్వపు ఆనంద క్షణాలని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ భామ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కాజల్ సోదరి నిషా అగర్వాల్ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇక ఇది ఇలా ఉండగా తమ అభిమాన నటి కాజల్ కొడుకు ఎలా ఉన్నాడో, ఏం పేరు పెట్టబోతున్నారో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే నిషా తన సోదరి కుమారుడికి నీల్ అనే పేరు పెట్టినట్టు తెలిపింది. ఇక కాజల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని 2020 అక్టోబర్లో పెళ్లాడింది. అయితే ఈ దంపతులకి కుమారుడు పుట్టడంతో తెగ సంతోషంలో ఉన్నారు.
అయితే కొడుకు పుట్టిన తర్వాత కాజల్ తొలిసారిగా స్పందించింది. బేబీ నీల్ని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించినందుకు సంతోషంగా ఉంది. నా బిడ్డను తెల్లటి వస్త్రంలో చుట్టుకుని దగ్గరకు హత్తుకున్నప్పుడు కలిగిన ఫీలింగ్ను మాటల్లో చెప్పలేను. ఆ క్షణాల్లో నేను ఎదుర్కొన్న అనుభూతి నాకు అద్భుతమైన తల్లి ప్రేమను అర్థమయ్యేలా చేసింది. బిడ్డ పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో గుర్తు చేసింది. ఏదీ అంత ఈజీగా జరగలేదు. మూడు నిద్రలేని రాత్రులు, రక్తస్రావం, సాగిన చర్మం, గడ్డకట్టిన ప్యాడ్లు, బ్రెస్ట్ పంప్స్, ఒత్తిడి, ఆందోళనతో సతమతమయ్యాను. కానీ ఎప్పుడైతే బుజ్జి పాపాయిని ఎత్తుకున్నానో అప్పుడు అవన్నీ మరచిపోయాను.
బిడ్డ కళ్లలోకి ప్రేమగా చూడటం, హత్తుకోవడం చేస్తూ కొత్త జీవితాన్ని ఆవిష్కరించుకుంటున్నానని తెలిపింది. అద్భుతమైన ఈ ప్రయాణాన్ని ఆనందంగా సాగిస్తున్నామని చెప్పింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు కానీ.. అందంగా మాత్రం ఉంటారని తెలిపింది. కాజల్ పోస్ట్కి పలువురు సెలబ్రిటీలతోపాటు నెటిజన్స్ సైతం కామెంట్స్, లైక్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. కాజల్ నటించిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది.
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…
మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే…
భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…
మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ పవన్…