Lemon : ప్రస్తుత తరుణంలో రోజు రోజుకీ పెట్రోల్, డీజిల్ రేట్లు ఏవిధంగా పెరిగిపోతున్నాయో అందరికీ తెలిసిందే. సామాన్యులకు ఇంధన ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. దీంతో జేబుకు భారీగా చిల్లు పడుతోంది. అలాగే నిమ్మకాయల ధరలు కూడా మండిపోతున్నాయి. నిమ్మకాయలు గతంలో ఎన్నడూ లేనివిధంగా ధర పలుకుతున్నాయి. దీంతో నిమ్మకాయకు ఈ వేసవిలో చాలా మంది ఇప్పటికే దూరం అయ్యారు. అయితే ఇదే విషయాన్ని అదునుగా చూసుకున్న ఆ మొబైల్ స్టోర్స్ యజమాని మాత్రం తమ సేల్స్ను పెంచుకునేందుకు వినూత్నమైన ఆలోచన చేశాడు. అదేమిటంటే..
వారణాసిలోని మొబి వరల్డ్ షాప్ వేసవి ఆఫర్లను ప్రకటించింది. తమ సేల్స్ను పెంచుకునేందుకు వారు వినూత్నమైన ఆలోచన చేసి దాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. తమ వద్ద రూ.10 వేలు.. అంతకన్నా ఎక్కువ ధర కలిగిన ఫోన్ను కొంటే లీటర్ పెట్రోల్ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే మొబైల్ ఫోన్లకు సంబంధించిన యాక్ససరీలను కొనుగోలు చేస్తే 1 నుంచి 5 వరకు నిమ్మకాయలను కూడా ఉచితంగా అందిస్తున్నామని తెలియజేసింది.
అలా ఆ షాప్ వారు ఆఫర్ను ప్రకటించడంతో జనాలు అక్కడ గుమిగూడుతున్నారు. తమకు ఇప్పుడు రద్దీ ఎక్కువైందని ఆ షాప్ వారు తెలియజేశారు. ఏది ఏమైనా రోజురోజుకీ పెరుగుతున్న ఇంధన ధరలతోపాటు నిమ్మకాయల ధరలను కూడా ఆసరాగా చేసుకుని వారు ఇలా ఆఫర్ను ప్రకటించడంతో పెద్ద ఎత్తున వినియోగదారులు ఆ షాప్కు వెళ్లి ఫోన్లు, యాక్ససరీలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆ షాప్ వారు తమ ఐడియా పనిచేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…
మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే…
భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…
మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ పవన్…