Manchu Lakshmi : శాండిల్ వుడ్ పవర్ స్టార్, హీరో పునీత్ రాజ్ కుమార్ మరణించారు. అక్టోబర్ 29న శుక్రవారం ఉదయం కన్నడ నటుడు పునీత్ కుమార్ ఛాతీ నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పగా ఆయన్ను వెంటనే బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అక్కడ వైద్యులు పునీత్ రాజ్ కుమార్ కు వైద్యం అందిస్తుండగానే చివరి శ్వాస విడిచారు. పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తతో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురైంది. ఈ వార్తపై సోషల్ మీడియాలో ఎంతోమంది నెటిజన్లతోపాటు సినీ సెలబ్రిటీస్ కూడా తమ సంతాపం తెలియజేస్తున్నారు.
వీరిలో మంచు లక్ష్మీ కూడా ఉన్నారు. కానీ ఈమె చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆమె చేసిన ట్వీట్ లో ఓఎంజీ.. నో.. ఇది నిజం కాకూడదు. అలా ఎలా అవుతుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మీ ఆత్మకు శాశ్వత శాంతి కలగాలి. చాలా త్వరగా చనిపోయారు.. అంటూ పునీత్ రాజ్ కుమార్ పేరును చేర్చారు. ఈ ట్వీట్ పునీత్ అభిమానుల్ని షాక్ తోపాటుగా బాధకు గురిచేసింది. మంచు లక్ష్మీ పాపులర్ ఉన్న నటి కనుక ఏం చేసినా ఊరుకోవాలా అంటూ మండిపడ్డారు. వైద్యుల నుండి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకుండా పోస్ట్ ఎలా చేస్తుంది.. అంటూ మండిపడుతున్నారు.
అసలు ఈ గందరగోళ వార్తలేంటి అంటూ నెటిజన్స్ అడిగిన ప్రశ్నకు మంచు లక్ష్మీ చేసిన పోస్ట్ ను తర్వాత తొలగించారు. అసలు నిజం తెలియకుండా ఇలా పోస్టులు పెడుతున్నందుకు అభిమానులు ఆమెపై మండిపడ్డారు. వైద్యులు మీడియాని ఉద్దేశించి మాట్లాడుతూ.. పునీత్ కు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని అన్నారని, బెంగుళూరు విక్రమ్ హాస్పిటల్ బయట భారీ సంఖ్యలో పునీత్ అభిమానులు వచ్చి ఆయన క్షేమం కోసం ఎన్నో రకాలుగా ప్రార్థించారని పునీత్ చిన్న కుమారుడు అన్నారు. పునీత్ ప్రస్తుతం కూడా ద్విత అనే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. గతంలో యూ టర్న్ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…