Manchu Lakshmi : శాండిల్ వుడ్ పవర్ స్టార్, హీరో పునీత్ రాజ్ కుమార్ మరణించారు. అక్టోబర్ 29న శుక్రవారం ఉదయం కన్నడ నటుడు పునీత్ కుమార్ ఛాతీ నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పగా ఆయన్ను వెంటనే బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అక్కడ వైద్యులు పునీత్ రాజ్ కుమార్ కు వైద్యం అందిస్తుండగానే చివరి శ్వాస విడిచారు. పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తతో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురైంది. ఈ వార్తపై సోషల్ మీడియాలో ఎంతోమంది నెటిజన్లతోపాటు సినీ సెలబ్రిటీస్ కూడా తమ సంతాపం తెలియజేస్తున్నారు.
వీరిలో మంచు లక్ష్మీ కూడా ఉన్నారు. కానీ ఈమె చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆమె చేసిన ట్వీట్ లో ఓఎంజీ.. నో.. ఇది నిజం కాకూడదు. అలా ఎలా అవుతుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మీ ఆత్మకు శాశ్వత శాంతి కలగాలి. చాలా త్వరగా చనిపోయారు.. అంటూ పునీత్ రాజ్ కుమార్ పేరును చేర్చారు. ఈ ట్వీట్ పునీత్ అభిమానుల్ని షాక్ తోపాటుగా బాధకు గురిచేసింది. మంచు లక్ష్మీ పాపులర్ ఉన్న నటి కనుక ఏం చేసినా ఊరుకోవాలా అంటూ మండిపడ్డారు. వైద్యుల నుండి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకుండా పోస్ట్ ఎలా చేస్తుంది.. అంటూ మండిపడుతున్నారు.
అసలు ఈ గందరగోళ వార్తలేంటి అంటూ నెటిజన్స్ అడిగిన ప్రశ్నకు మంచు లక్ష్మీ చేసిన పోస్ట్ ను తర్వాత తొలగించారు. అసలు నిజం తెలియకుండా ఇలా పోస్టులు పెడుతున్నందుకు అభిమానులు ఆమెపై మండిపడ్డారు. వైద్యులు మీడియాని ఉద్దేశించి మాట్లాడుతూ.. పునీత్ కు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని అన్నారని, బెంగుళూరు విక్రమ్ హాస్పిటల్ బయట భారీ సంఖ్యలో పునీత్ అభిమానులు వచ్చి ఆయన క్షేమం కోసం ఎన్నో రకాలుగా ప్రార్థించారని పునీత్ చిన్న కుమారుడు అన్నారు. పునీత్ ప్రస్తుతం కూడా ద్విత అనే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. గతంలో యూ టర్న్ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…