SS Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ జోష్లో ఉన్నారు. ఈ మూవీ ఘన విజయం సాధించడంతో ఆయన ఖ్యాతి ఖండాంతరాలకు సైతం పాకింది. ఎంతో మంది విదేశీ సెలబ్రిటీలు సైతం ఈ మూవీని ప్రశంసిస్తున్నారు. రాజమౌళి ప్రతిభను కొనియాడుతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ మేనియా ముగిసింది కనుక ఇక రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్పై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే మహేష్తో ఆయన తీయబోయే సినిమా ఎలా ఉంటుందా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ 2023లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్తో కలిసి సినిమా చేయనున్నారు. ఇది ఆగస్టులో ప్రారంభం కానుంది. ఈ మూవీ పూర్తయ్యే సరికి వచ్చే ఏడాది జనవరి అవుతుందని అంటున్నారు. కనుక ఆ తరువాతే మహేష్.. రాజమౌళితో సినిమా చేయనున్నారు. ఇక ఈ మూవీని రూ.800 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తారని వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీకి రూ.550 కోట్లు పెట్టారు కనుక ఈ మూవీకి అంతకన్నా ఎక్కువే కానుంది.
ఇక రాజమౌళి మహేష్తో తీయబోయే సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో మూవీ ఉంటుందని ఆయన ఇది వరకే హింట్ ఇచ్చారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రాజమౌళికి ఓ భారీ డీల్ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. రూ.100 కోట్లను ఆయనకు అందుకు రెమ్యునరేషన్గా ఇస్తామని నెట్ ఫ్లిక్స్ తెలిపిందట.
తమకు ఒరిజినల్ కంటెంట్ కలిగిన ఓ వెబ్సిరీస్ను తీసి పెట్టాలని.. ఎలాంటి కథ అయినా సరే తాము నిర్మించేందుకు సిద్ధమని.. వెబ్ సిరీస్ను తీసి ఇస్తే రూ.100 కోట్లు ఇస్తామని నెట్ ఫ్లిక్స్ రాజమౌళికి ఆఫర్ను ఇచ్చిందట. అయితే ఆయన అందుకు ఓకే చెప్పారో లేదో తెలియదు కానీ.. ఆయన సాధారణంగా ఒక ప్రాజెక్ట్ చేసే సమయంలో ఇంకో ప్రాజెక్ట్కు ఒప్పుకోరు. ఒక వేళ ఒప్పుకున్నా ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ తరువాతే ఆ ప్రాజెక్ట్ చేస్తారు. కనుక మహేష్తో మూవీని తీశాకే నెట్ ఫ్లిక్స్కు సిరీస్ చేసి పెడతారని తెలుస్తోంది. ఇక ఈ మూవీకి ఎలాగూ 3 ఏళ్లు పడుతుంది కనుక నెట్ ఫ్లిక్స్ అప్పటి వరకు ఆగాల్సిందే. మరి అప్పుడైనా ఆయన ఈ డీల్కు ఓకే చెబుతారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…