Neha Shetty : మెహబూబా సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఈ అమ్మడు రీసెంట్గా డీజే టిల్లు చిత్రంతో పలకరించింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఇందులో నేహా శెట్టి పర్ఫార్మెన్స్కి ప్రతి ఒక్కరూ మంత్ర ముగ్ధులు అయ్యారు. ఈ సినిమాలో రాధికగా మెప్పించిన నేహా శెట్టి.. డీజే టిల్లు గురించి చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయతో జతకట్టింది. ఈ సినిమా ఇటీవల లాంచింగ్ కార్యక్రమం జరుపుకుంది.
డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిదని దర్శకుడు క్రాక్స్ అన్నాడు. కార్తికేయకు ఇదొక డిఫరెంట్ సినిమా. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిస్తున్నామని నిర్మాత బెన్నీ ముప్పనేని తెలిపాడు. అయితే నేహా శెట్టి సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. తన అందచందాలతో కుర్రకారు మనసులు దోచుకుంటూనే అప్పుడప్పుడు ఆసక్తికర విషయాలు తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా తన మనసులో ఉన్న కోరికని బయటపెట్టి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
నేహా శెట్టి రానున్న రోజులలో మహేష్.. రామ్ చరణ్.. బన్నీ.. లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేయాలని టార్గెట్ గా పెట్టుకుందట. బన్నీ సరసన ఓ యాడ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ వెండితెర ఛాన్స్ కోసం గట్టిగానే ఎదురుచూస్తోంది. మరి ఈ అమ్మడి కోరిక ఎప్పుడు నిజం అవుతుందో అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేహా శెట్టి ఖాతాలో ఇప్పుడు పలు ఆఫర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య తన పుట్టు మచ్చల గురించి ఓ జర్నలిస్ట్ తప్పుడు ప్రశ్న వేయగా దీటుగా బదులు చెప్పింది. ట్రైలర్ లాంచ్లో ఈ ప్రశ్న అడగడం చాలా దురదృష్టకరం. ఇది తన పట్ల, తన చుట్టూ వర్క్ ప్లేస్లో, ఇంట్లో ఉన్న మహిళల పట్ల ఆయనకెంత గౌరవం ఉందో తెలియజేస్తుందని ఆమె ట్వీట్ చేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…