Nayanthara : నయనతార తల్లైన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మలయాళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా మారిన నయనతార తర్వాత దక్షిణాదిలోని టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడి కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ భామ ఈ ఏడాది జూన్ నెలలో మహాబలేశ్వరంలో విగ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది. సెలబ్రెటీల పెళ్లి ఒక సెన్సేషన్ అయితే వాళ్లకి పుట్టే పిల్లలను కూడా సెన్సేషన్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఇప్పుడు ఈ సెన్సేషన్ కి గురైన జంట నయనతార విఘ్నేష్ శివన్.
ప్రస్తుతం వారికి పుట్టిన కవలలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. దానికి కారణం వారు సరోగసి ద్వారా పిల్లలను కనడమే అని మనందరికీ తెలిసిందే. అంతేకాక వారికి పెళ్లి జరిగి కేవలం 5 నెలలు మాత్రమే కావడం ఈ వార్త మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ వార్తతో పాటు కొంతమంది నెటిజన్లు మరొక వార్తను కూడా వైరల్ చేస్తున్నారు. అదేమిటంటే నయనతార విఘ్నేష్ శివన్ ల వివాహం జరిగినప్పుడు, ఆ వేడుకను డైరెక్టర్ గౌతమ్ మీనన్ చేత నెట్ ఫ్లిక్స్ షూట్ చేయించిందని, దానిని తొందరలోనే నెట్ ఫ్లిక్స్ తన ఛానల్లో స్ట్రీమింగ్ చేయనుందని అప్పట్లో ఓ వార్త ప్రముఖంగా వినిపించింది.
కానీ వారి వివాహం జరిగి కొన్ని నెలలు గడిచినప్పటికీ ఇంకా నెట్ ఫ్లిక్స్ ఆ వివాహ వేడుకకు సంబంధించిన ఎలాంటి వీడియోను రిలీజ్ చేయలేదు. కాబట్టి నయన్ అభిమానులు నెట్ ఫ్లిక్స్ ను నయన్ కి కవలలు కూడా జన్మించారు. మీరు మాత్రం పెళ్లి వీడియోను ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారు..? అంటూ సరదాగా అడుగుతున్నారు. నయన్ పిల్లల విషయంతో పాటు ఈ విషయం కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. చూద్దాం నెట్ ఫ్లిక్స్ ఇకనైనా నయన్ పెళ్లి వీడియోకి సంబంధించి ఎలాంటి సమాచారం ఇస్తుందో..!
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…