Nayanthara : నయనతార తల్లైన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మలయాళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా మారిన నయనతార తర్వాత దక్షిణాదిలోని టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడి కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ భామ ఈ ఏడాది జూన్ నెలలో మహాబలేశ్వరంలో విగ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది. సెలబ్రెటీల పెళ్లి ఒక సెన్సేషన్ అయితే వాళ్లకి పుట్టే పిల్లలను కూడా సెన్సేషన్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఇప్పుడు ఈ సెన్సేషన్ కి గురైన జంట నయనతార విఘ్నేష్ శివన్.
ప్రస్తుతం వారికి పుట్టిన కవలలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. దానికి కారణం వారు సరోగసి ద్వారా పిల్లలను కనడమే అని మనందరికీ తెలిసిందే. అంతేకాక వారికి పెళ్లి జరిగి కేవలం 5 నెలలు మాత్రమే కావడం ఈ వార్త మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ వార్తతో పాటు కొంతమంది నెటిజన్లు మరొక వార్తను కూడా వైరల్ చేస్తున్నారు. అదేమిటంటే నయనతార విఘ్నేష్ శివన్ ల వివాహం జరిగినప్పుడు, ఆ వేడుకను డైరెక్టర్ గౌతమ్ మీనన్ చేత నెట్ ఫ్లిక్స్ షూట్ చేయించిందని, దానిని తొందరలోనే నెట్ ఫ్లిక్స్ తన ఛానల్లో స్ట్రీమింగ్ చేయనుందని అప్పట్లో ఓ వార్త ప్రముఖంగా వినిపించింది.
కానీ వారి వివాహం జరిగి కొన్ని నెలలు గడిచినప్పటికీ ఇంకా నెట్ ఫ్లిక్స్ ఆ వివాహ వేడుకకు సంబంధించిన ఎలాంటి వీడియోను రిలీజ్ చేయలేదు. కాబట్టి నయన్ అభిమానులు నెట్ ఫ్లిక్స్ ను నయన్ కి కవలలు కూడా జన్మించారు. మీరు మాత్రం పెళ్లి వీడియోను ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారు..? అంటూ సరదాగా అడుగుతున్నారు. నయన్ పిల్లల విషయంతో పాటు ఈ విషయం కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. చూద్దాం నెట్ ఫ్లిక్స్ ఇకనైనా నయన్ పెళ్లి వీడియోకి సంబంధించి ఎలాంటి సమాచారం ఇస్తుందో..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…