Nayanthara : నయనతార తల్లైన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మలయాళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా మారిన నయనతార తర్వాత దక్షిణాదిలోని టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడి కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ భామ ఈ ఏడాది జూన్ నెలలో మహాబలేశ్వరంలో విగ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది. అయితే వీరి పెళ్లి జరిగి 4 నెలలు కూడా పూర్తి కాకుండానే తాము ఇద్దరం కవల పిల్లలకు జన్మనిచ్చామంటూ అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు. నయనతార ఈ మధ్య కూడా మీడియా కంట పడటం, అప్పుడు ఏమాత్రం గర్భంతో ఉన్న ఛాయలు కనిపించకపోవడంతో ఆమె సరోగసి ద్వారానే బిడ్డను కానీ ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతోంది.
ఈ విషయాన్ని ఇప్పటివరకు నయనతార కానీ విగ్నేష్ శివన్ కానీ అధికారికంగా ప్రకటించలేదు. సరోగసి ద్వారా పిల్లలు పొందిన వారిలో నయన్, విగ్నేష్ జంట మొదటి వారు కాదు. ప్రియాంక చోప్రా, మంచు లక్ష్మి, శిల్పా శెట్టి, కరణ్ జోహార్ లాంటి సీలెబ్రిటీలు అంతా సరోగసి విధానం ద్వారా పిల్లల్ని కన్నారు. అయితే ఈ ఏడాది జనవరి నెలలో సరోగసిని భారతదేశంలో బ్యాన్ చేశారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే సరోగసి ద్వారా బిడ్డలు కనేందుకు అనుమతులు ఇస్తూ ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా రూపొందించారు.
ఈ నేపథ్యంలో 37 ఏళ్ల నయనతార సరోగసీ ద్వారా బిడ్డలు కనడానికి అర్హురాలు కాదని చెబుతూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీంతో ఈ విషయం మీద తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. నయనతార, విగ్నేష్ శివన్ ల సరోగసి ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా అనే విషయంలో ఆరోగ్య శాఖ విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్.. సరోగసిపై ప్రభుత్వానికి వివరాలు అందించాలని ఆదేశించారు. ఈ వివాదంపై నయన్, విగ్నేష్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…