Nayanthara : నయనతార, విఘ్నేశ్ దంపతులు సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారన్న వార్త ఎంతటి సంచనలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడు, దర్శకుడు విగ్నేష్ శివన్ని ప్రేమించి పెళ్లాడిన నయన్.. పెళ్లి జరిగి 4 నెలలు కూడా పూర్తి కాకముందే మగ కవల పిల్లలంటూ అధికారిక ప్రకటన చేశారు. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది. ఆడియన్స్ పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెప్పినప్పటికీ.. ఈ కవల పిల్లల మ్యాటర్ వెనుక సీక్రెట్స్ ఏంటి అనే కోణంలో చర్చించుకున్నారు.
దీనిపై లోతుగా దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం మెడికల్ అడిషినల్ డైరెక్టర్ సారథ్యంలో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటీ విచారణ కూడా చేపట్టింది. ఈ కమిటీ వద్ద నయనతార తన సరోగసీ విధానానికి సంబంధించిన పూర్తి ఆధారాలను సమర్పించినట్టు తెలిసింది. ముఖ్యంగా.. తాము ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్ వివాహం చేసుకున్నట్లుగా ధ్రువీకరించే సర్టిఫికెట్లను నయనతార ఆ కమిటీకి అందించినట్లు సమాచారం.
అలాగే గత డిసెంబరులో అద్దెగర్భం కోసం రిజిస్టర్ చేసుకుని ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు. సరోగసీ విధానం ద్వారా తల్లిదండ్రులు కావాలంటే వివాహమై ఐదేళ్ళు పూర్తి కావాల్సివుంది. భార్య వయస్సు 25 నుంచి 50 యేళ్ళలోపు, భర్త వయస్సు 26 నుంచి 55 యేళ్ళలోపు ఉండాలన్న నిబంధనలు ఉన్నాయి. నయనతార ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్ వివాహం చేసుకోవడం వల్ల ఆమె ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని విచారణ కమిటీకి ఆధారాలు సమర్పించినట్టు సమాచారం. మరి ఈ సరోగసి వ్యవహారం చివరకు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…