Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్లు జూన్ 9న మహాబలేశ్వరంలో సంప్రదాయబద్దంగా ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి బాలీవుడ్, కోలీవుడ్ నుంచి అనేక మంది సినీ ప్రముఖులు వచ్చారు. రజనీకాంత్, షారూఖ్ ఖాన్ లు హాజరయ్యారు. అయితే వీరి పెళ్లికి సంబంధించిన వీడియో హక్కులను రూ.25 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ మధ్య ఓ వివాదం తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
నయనతార, విగ్నేష్ దంపతులు తమ పెళ్లి ఫొటోలను నెల రోజులు కూడా కాకముందే డీల్కు విరుద్ధంగా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారని.. కనుక వారి పెళ్లి వీడియోకు గాను ముందుగా అనుకున్న మొత్తం కంటే తక్కువ మొత్తాన్ని అందిస్తామని నెట్ఫ్లిక్స్ వారికి షాకిచ్చిందని.. వార్తలు వచ్చాయి. అయితే వీటిని నయనతార టీమ్ కొట్టి పారేసింది. అలాంటిదేమీ లేదని.. వట్టి పుకార్లేనని స్పష్టం చేశారు. ఇక నెట్ ఫ్లిక్స్లో వీరి పెళ్లి వీడియో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు.
అయితే నయన్, విగ్నేష్ల పెళ్లి వీడియో నెట్ ఫ్లిక్స్లో ఎప్పుడు ప్రసారం అవుతుందో తెలియదు. కానీ త్వరలోనే ఆ వీడియోను వారు స్ట్రీమ్ చేస్తారని సమాచారం. ఇక పెళ్లి అనంతరం ఈ దంపతులు బ్యాంకాక్కు హనీమూన్కు వెళ్లి వచ్చారు. తరువాత నయనతార యథావిధిగా షూటింగ్లలో పాల్గొంటోంది. ఈమె ప్రస్తుతం షారూఖ్ ఖాన్ పక్కన జవాన్ అనే మూవీలో నటిస్తోంది. దీనికి తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాదిలో విడుదల అవుతుందని తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…