నేటి నుంచే నవరాత్రులు ప్రారంభం.. కలశ స్థాపన ఏ సమయంలో చేయాలో తెలుసా?

October 6, 2021 11:02 PM

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి ప్రత్యేక వస్తువులతో పూజిస్తారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నవరాత్రి ఉత్సవాలకు ఇప్పటికే ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి.

దేవీ నవరాత్రిలో భాగంగా ప్రతి రోజూ అమ్మవారిని అలంకరణ చేసి భక్తిశ్రద్ధలతో వివిధ రకాల నైవేద్యాలతో పూజిస్తారు. ఇక పోతే మొదటి రోజు అమ్మవారిని పూజించడానికి కలశస్థాపన ఏ సమయంలో చేయాలి ?సరైన ముహూర్తం ఏది ? అనే విషయాలను తెలుసుకొని ఆచారం ప్రకారమే కలశస్థాపన చేయాలని పండితులు చెబుతున్నారు.

నవరాత్రులలో అమ్మవారిని పూజించడం కోసం కలశస్థాపన ఉదయం 6:17 నిమిషాల నుంచి 7:07 వరకు మంచి ముహూర్తం అని పండితులు తెలియజేస్తున్నారు. ఈ ముహూర్తంలోనే అమ్మవారికి కలశస్థాపన చేసి నవరాత్రులు పూర్తయ్యేవరకు కలశాన్ని కదిలించకూడదు. అదేవిధంగా కలశం ముందు వెలిగించిన అఖండ దీపం నిత్యం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now