Natu Natu Song : ఇటీవలి కాలంలో సంగీత ప్రియులని పలు సాంగ్స్ ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. శ్రీ వల్లి, నాటు నాటు, అరబిక్ కుతు సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అయితే ఇందులో నాటు నాటు సాంగ్కి రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన డ్యాన్స్ చాలా మందిని ఆకట్టుకుంది. ఈ పాటలో చరణ్, తారక్ డ్యాన్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించింది. హుక్ స్టెప్ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. నాటు నాటు స్టెప్పులేయని అభిమాని లేడు. సోషల్ మీడియాలో ఈ పాట..స్టెప్పులు ట్రెండింగ్ లో నిలిచాయి. ఈ సాంగ్ విడుదలైన తర్వాత సామాన్యులు, సెలబ్రిటీలు సైతం ఈ పాటకి స్టెప్పులు వేశారు. నాటు నాటు సాంగ్ మానియాలో మునిగి తేలారు.
ప్రమోషన్స్ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్..అమీర్ ఖాన్ సైతం ఈ హుక్ స్టెప్పు వేసి ఆకట్టుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీలో దర్శకుడు రాజమౌళి – మరో దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి స్టేజ్ పై నాటు నాటు స్టెప్ ని దించేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈవేడుకలోకి మెగాస్టార్ చిరంజీవి-నటసింహం బాలకృష్ణని సైతం అభిమానులు లాగుతున్నారు. నాటు నాటు స్టెప్పుకు చిరంజీవి- బాలయ్య ముఖాల్ని మార్పింగ్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇద్దరు హీరోల అభిమానులు ఆ మార్పింగ్ ఫొటోని ఎవరి సోషల్ మీడియా ఖాతాల్లో వారు పోస్ట్ చేసి షేర్ చేయడం విశేషం.
చిరంజీవి- బాలయ్య అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. కానీ ఈ పాట విషయంలో అభిమానులే తమ హీరోల్ని తెగ ప్రోత్సహిస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన మార్పింగ్ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇక నిజంగా బాలయ్య-చిరంజీవి ఒకే వేదికపై కలిస్తే మాత్రం నాటు నాటు తప్పక పడుతుందని చెప్పొచ్చు. అప్పుడు ఆ కిక్కే వేరుగా ఉంటుంది. కానీ ఆ సమయం రావాలి. చిరంజీవి-బాలయ్య ఇలాంటి విషయాల్లో చాలా జోవియల్ గా ఉంటారు. బాలయ్య సరదాను అన్స్టాపబుల్ షోలో మనందరం చూశాం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…