Naresh : గత కొద్ది రోజులుగా సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ల వ్యవహారం ఎక్కడ చూసినా వైరల్ అవుతోంది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కథలు కథలుగా వార్తలు వచ్చాయి. అయితే మైసూర్లోని ఓ హోటల్లో నరేష్, పవిత్ర లోకేష్ పట్టుబడడం.. తరువాత వారు తమ మధ్య ఉన్న బంధాన్ని అంగీకరించడంతో.. అంతకు ముందు వచ్చిన వార్తలే నిజమయ్యాయి. అయితే ఇద్దరూ తమ పార్ట్నర్స్తో విడాకులు తీసుకోలేదని.. కనుక వివాహం కోసమే కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. అయితే ఈ మధ్యలోనే నరేష్ భార్య రమ్య ఎంటర్ అవడంతో మొత్తం రచ్చ రచ్చ అయింది. ఈ మొత్తం వ్యవహారంలో రమ్య కన్నా ఎక్కువగా నరేష్, పవిత్ర లోకేష్లే పరువు పోగొట్టుకున్నారని చెప్పవచ్చు.
గతంలో నరేష్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో హుందాగా ఉండేవారు. మా అసోసియేషన్ను ఆయన తన భుజాలపై మోశారు. అయితే ఇప్పుడు ఆయన ఏకాకి అయ్యారు. ఆయన విషయాల్లో ఎవరూ తలదూర్చడం లేదు. ఆయనకు మా అసోసియేషన్ నుంచే ఎవరూ మద్దతు పలకడం లేదు. దీంతో నరేష్ పరువు పోగొట్టుకున్నట్లు స్పష్టమైంది. ఇక పవిత్ర లోకేష్ కూడా గతంలో ఫ్యామిలీ నటిగా ఎంతో పేరు తెచ్చుకుంది. కానీ ఒకే సంఘటనతో ఆమె పరువు మొత్తం పోయింది. ఈ క్రమంలోనే ఆమెను తమ సినిమాల్లో పెట్టుకోవాలంటేనే మేకర్స్ భయపడుతున్నారట. అందుకనే ఆమెను రెండు సినిమాల నుంచి నిర్మాతలు తొలగించినట్లు తెలుస్తోంది.
అయితే గతంలో నరేష్ ఒక సందర్భంలో తన భార్య రమ్య గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన సినిమా కెరీర్ 17 ఏళ్లకే ప్రారంభం అయిందని, 19 ఏళ్లకు పెళ్లి చేశారని తెలిపారు. తనకు ఇది బాల్య వివాహంలా అనిపించిందన్నారు. ఈ క్రమంలోనే ఆమెకు హెల్త్ బాగాలేకపోవడంతో విడాకులు ఇచ్చేసినట్లు తెలిపారు. అయితే తన మూడో భార్య రమ్య మాత్రం చాలా మంచిదన్నారు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషని, తన ఆలోచనలకు, అభిప్రాయాలకు సరిపోయే వ్యక్తి అని కొనియాడారు. తన ఫ్యామిలీలో రమ్య త్వరగా సర్దుకుపోయిందని.. నరేష్ అన్నారు.
అయితే నరేష్ గతంలో చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు మళ్లీ తెర మీదకు తెస్తున్నారు. అప్పట్లో నరేష్ తన భార్య రమ్యను అంతగా పొడిగారు.. మరి ఇప్పుడేమైంది.. ఎందుకు ఆమెను అలా చిత్రీకరిస్తున్నారు.. ఆమెకు అక్రమ సంబంధాలను ఎందుకు అంటగడుతున్నారు.. అసలు నరేష్, రమ్య మధ్య ఏమైంది.. వీటన్నింటికీ నరేష్ జీవితంలోకి పవిత్ర లోకేష్ రావడమే కారణమా.. అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరి వ్యవహారం చివరకు ఎలా ముగుస్తుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…