Namrata Shirodkar : సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య, ఒకప్పటి హీరోయిన్ నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె, మహేష్ బాబు టాలీవుడ్లోని క్యూట్ కపుల్స్లో ఒకరు. వీరికి సితార, గౌతమ్ కృష్ణ సంతానం. ప్రస్తుతం వీరు ఏ సమస్యా లేకుండా అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇక మహేష్ బాబుకు చెందిన బిజినెస్ వ్యవహారాలను నమ్రతనే స్వయంగా చూసుకుంటోంది. అయితే నమ్రత, మహేష్లది ప్రేహ వివాహం అన్న సంగతి తెలిసిందే. వీరు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
వంశీ అనే సినిమా షూటింగ్ సమయంలో నమ్రత, మహేష్లు ప్రేమలో పడ్డారు. తరువాత పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి అయ్యాక నమ్రత సినిమాలకు వీడ్కోలు పలికింది. అప్పటికి ఆమె స్టార్ హీరోయిన్. సినిమాల్లో నటించి ఉంటే ఇంకా మంచి పేరు వచ్చేది. కానీ ఆమె సినిమాలకు గుబ్ బై చెప్పింది. ఇల్లాలిగా ఉండేందుకే సిద్ధపడింది. అయితే ఇదే విషయంపై నమ్రత ఇటీవల మీడియాతో మాట్లాడింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమెను జర్నలిస్టులు ప్రశ్నించారు. ఈ సందర్భగా ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది.
మీరు సినిమాల్లో మళ్లీ నటించవచ్చు కదా.. రీఎంట్రీ ఇవ్వరా.. అని ఆమెను మీడియా ప్రతినిధులు అడిగారు. అయితే ఇందుకు ఓపిగ్గా నమ్రత సమాధానాలు చెప్పింది. నన్ను తెరపై చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఇదే అడుగుతున్నారు. అయితే హీరోయిన్గా కంటే ఓ భార్యగా, తల్లిగా ఉండేందుకే నేను ఇష్టపడతా. ప్రస్తుతం నేను నా కుటుంబ బాధ్యతలతో చాలా బిజీగా ఉన్నా. ఇది నాకు చాలు, సినిమాలపై ప్రస్తుతం దృష్టి సారించలేను. అయితే రాబోయే రోజుల్లోనూ నేను సినిమాల్లో నటించాలని అనుకోవడం లేదు.. అని నమ్రత తేల్చేసింది.
ఇక నమ్రత అలా చెప్పడంపై ఫ్యాన్స్ హర్టయ్యారు. ఆమె ఎప్పటికైనా సరే సినిమాల్లోకి వస్తుందని.. మహేష్తో కలసి నటిస్తుందని ఫ్యాన్స్ ఇప్పటి వరకు ఆశిస్తూ వచ్చారు. కానీ అది జరగదని తేలిపోయింది. దీంతో వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే నమ్రత రీ ఎంట్రీపై ఇప్పటి వరకు మహేష్ మాట్లాడలేదు. ఆయన సైలెంట్గానే ఉన్నారు. మరి దీనిపై ఆయన ఏమంటారో చూడాలి.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…