Namrata Shirodkar : నమ్రత శిరోద్కర్ మాజీ మిస్ ఇండియా, ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి అని ఇలా చెబితే తెలుగు వారికి కాస్త కొత్తగా అనిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగా నమ్రత అందరికీ సుపరిచితమే. వంశీ సినిమాతో మహేష్ బాబు నమ్రత మధ్య ఏర్పడిన పరిచయం వారి పెళ్లి వరకు నడిపించింది. అప్పుడే కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు వంశీ సినిమా హీరోయిన్ నమ్రత ప్రేమలో పడి వివాహ బంధంతో ఒకటయ్యారు.
ఇక నమ్రత వ్యక్తిగత జీవిత విషయానికి వెళ్తే.. ఈమె మహారాష్ట్రలో పుట్టి పెరిగింది. నమ్రత 1972 జనవరి 22 న ముంబై లో జన్మించింది. ఆమె తండ్రి నితిన్ శిరోద్కర్. అప్పట్లో ఆయన క్రికెటర్. ఆయన పూర్తీ పేరు నితిన్ పాండురంగ శిరోద్కర్. ముంబైకి ఆడే దేశవాళీ క్రికెట్ లో ఎంతో పేరు తెచ్చుకున్నారు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగసర్కార్ వంటి స్టార్ ఆటగాళ్లతో నితిన్ శిరోద్కర్ ఆడేవారట. నితిన్ టోర్నమెంట్స్ ఆడేటప్పుడు అదే పనిగా టెలిగ్రామ్స్ వచ్చేవట. దాంతో తోటి ఆటగాళ్లు ఆశ్చర్యపోయేవారు.
అయితే నితిన్ ఆ టెలిగ్రామ్స్ ని పెద్దగా పెట్టించుకొనేవాడు కాదు. కొత్తగా పెళ్ళైన నితిన్ కి తన భార్య వనిత నుండి ఆ టెలిగ్రామ్స్ వచ్చేవట. దాంతో అందరు ఆయనను ఆటపట్టించేవారు. నితిన్ తన కెరీర్ లో మంచి ఫాస్ట్ బౌలర్ గా ఎదిగారు. అద్భుతమైన బౌలర్ గా అప్పటిలో చెప్పుకొనేవారు. ఇక నమ్రత తల్లి విషయానికి వస్తే ఆమె అప్పటిలో పెద్ద మోడల్. నమ్రత అమ్మమ్మ మీనాక్షి శిరోద్కర్ మరాఠీ నటిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు.
ఒక రకంగా సెలబ్రెటీ కుటుంబం నుండి వచ్చిన నమ్రత మొదట్లో మోడలింగ్ రంగంలో గుర్తింపు తెచ్చుకుంది. 1993 లో మిస్ ఇండియాగా కిరీటాన్ని దక్కించుకొని మిస్ యూనివర్స్ పోటీలకు సెలట్ అయ్యింది. అయితే నమ్రత మిస్ యూనివర్స్ గా 5 వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక అప్పటి నుండి సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. నమ్రత 1998 లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2000లో వంశీ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…