Nagababu : నాగబాబు కేవలం నటుడిగానే కాదు.. నిర్మాతగా కూడా గతంలో పలు సినిమాలు తీసిన విషయం విదితమే. ఇప్పుడు ఆయన నిర్మాతగా వ్యవహరించడం లేదు. కానీ గతంలో ఆయన పలు హిట్ చిత్రాలు నిర్మించారు. తన తల్లి అంజనా దేవి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్ను స్థాపించిన నాగబాబు ఆ బ్యానర్పై రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు బాగున్నారా, గుడుంబా శంకర్, స్టాలిన్, ఆరెంజ్ లాంటి చిత్రాలను నిర్మించారు. అయితే రామ్ చరణ్తో తీసిన ఆరెంజ్ మూవీ ఆయనకు భారీ నష్టాలను తెచ్చి పెట్టింది. దీంతో ఆయన మళ్లీ నిర్మాతగా వ్యవహరించలేదు.
అయితే నాగబాబును మళ్లీ నిర్మాతగా మార్చేందుకు అల్లు అర్జున్ గతంలో యత్నించాడు. అందులో భాగంగానే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నాగబాబు ఇంకో భాగస్వామిగా ఉన్నారు. కానీ అది కూడా ఫ్లాప్ అయింది. దీంతో మళ్లీ నాగబాబు నిర్మాతగా మారలేదు. నటుడిగానే కొనసాగుతున్నారు. టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన నిర్మాతగా ఉన్నప్పుడు చేసిన సినిమాల వల్ల భారీగా నష్టాలు వచ్చి అప్పుల పాలయ్యారు. అందుకనే ఇక నిర్మాతగా ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే ఆయన మళ్లీ నిర్మాతగా మారనున్నారు. అది కూడా తన కుమారుడు వరుణ్ తేజ్ సినిమాకే కావడం విశేషం.
వరుణ్ తేజ్ నటించిన ఎఫ్3 మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ అనంతరం వరుణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పేశారు. ప్రవీణ్ సత్తారుతో కలిసి ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నట్లు చెప్పారు. జూలై నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే వరుణ్తో తొలిప్రేమ సినిమా తీసిన బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీకి ఒక నిర్మాతగా వ్యవహరించనున్నారు. అలాగే ఇందులో నాగబాబు కూడా ఇంకో నిర్మాతగా ఉండనున్నారు. దీంతో నాగబాబు త్వరలోనే మళ్లీ నిర్మాతగా మారనున్నారన్నమాట. అయితే నిర్మాతగా అపజయాలను ఎదుర్కొన్న నాగబాబుకు ఈసారి ఏమవుతుంది.. ఆయన మళ్లీ నిర్మాతగా హిట్ కొడతారా.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…