Nagababu : ఏపీ మంత్రిగా ప్రమోషన్ పొందాక రోజా వైసీపీ ప్రత్యర్ధులపై తెగ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, నాగబాబులపై దారుణమైన కామెంట్స్ చేసింది. వారు ఎవరికి సాయం చేయరంటూ కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో మెగా అభిమానులు. జనసైనికులు రోజాపై నిప్పులు చెరిగారు. ఇక చిరంజీవికి వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ లో దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా, కూల్గా స్పందించారు. నన్ను తిడితేనే వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది. అడ్డ దారిలో గుర్తింపు కోరుకునే వారు నన్ను, నా ఫ్యామిలీని తిడుతుంటారు. అని రోజా పేరు ఎత్తకుండానే గట్టిగా సమాధానం ఇచ్చారు.
ఇటీవల నా ఇంటికి కూడా వచ్చి వెళ్లారు. నేను ఎవ్వరికి సహాయం చేయలేదని, ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయడం లేదని అంటున్నారు. నా గురించి అందరికీ తెలుసు, అది వారికి కూడా తెలుసు అంటూ రోజా కి సంబంధించి గట్టిగానే జవాబు చెప్పే ప్రయత్నం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇదే విషయంపై తాజాగా నాగబాబు కూడా స్పందించారు. అన్నయ్య ఏ రోజు ఎవరికి హాని చేయరు. అయిన ఆయనని విమర్శిస్తూనే ఉంటారు. ఆయన తప్పు చేస్తే నేను మౌనం వహిస్తాను. కాని ఆయన కోట్ల రూపాయలు దానం చేస్తుంటారు.
రోజా లాంటివారి కామెంట్స్ కి రియాక్ట్ అవ్వడం కంటే.. తనని తాను డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తానని.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు రాళ్లు తగులుతుంటాయి. విమర్శించేవాళ్ళు కూడా అంతే. రాళ్ల లాంటి వాళ్లే.. వాళ్ళని ఏమని తిడతాం” అన్నారు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. జబర్ధస్త్ సమయంలో రోజా, నాగబాబు మధ్య మంచి సానిన్నిహిత్యం ఉండేది. ఆ క్రమంలో నాగబాబు రోజాపై పెద్దగా ఫైర్ కాలేదని తెలుస్తుంది. ఏదేమైన పవన్ కళ్యాణ్ రాజకీయ ఎంట్రీతో ఏపీలో రాజకీయ వాతావరణం చాలా వాడి వేడిగా ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…