Nagababu : ఏపీ మంత్రిగా ప్రమోషన్ పొందాక రోజా వైసీపీ ప్రత్యర్ధులపై తెగ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, నాగబాబులపై దారుణమైన కామెంట్స్ చేసింది. వారు ఎవరికి సాయం చేయరంటూ కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో మెగా అభిమానులు. జనసైనికులు రోజాపై నిప్పులు చెరిగారు. ఇక చిరంజీవికి వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ లో దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా, కూల్గా స్పందించారు. నన్ను తిడితేనే వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది. అడ్డ దారిలో గుర్తింపు కోరుకునే వారు నన్ను, నా ఫ్యామిలీని తిడుతుంటారు. అని రోజా పేరు ఎత్తకుండానే గట్టిగా సమాధానం ఇచ్చారు.
ఇటీవల నా ఇంటికి కూడా వచ్చి వెళ్లారు. నేను ఎవ్వరికి సహాయం చేయలేదని, ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయడం లేదని అంటున్నారు. నా గురించి అందరికీ తెలుసు, అది వారికి కూడా తెలుసు అంటూ రోజా కి సంబంధించి గట్టిగానే జవాబు చెప్పే ప్రయత్నం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇదే విషయంపై తాజాగా నాగబాబు కూడా స్పందించారు. అన్నయ్య ఏ రోజు ఎవరికి హాని చేయరు. అయిన ఆయనని విమర్శిస్తూనే ఉంటారు. ఆయన తప్పు చేస్తే నేను మౌనం వహిస్తాను. కాని ఆయన కోట్ల రూపాయలు దానం చేస్తుంటారు.
రోజా లాంటివారి కామెంట్స్ కి రియాక్ట్ అవ్వడం కంటే.. తనని తాను డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తానని.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు రాళ్లు తగులుతుంటాయి. విమర్శించేవాళ్ళు కూడా అంతే. రాళ్ల లాంటి వాళ్లే.. వాళ్ళని ఏమని తిడతాం” అన్నారు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. జబర్ధస్త్ సమయంలో రోజా, నాగబాబు మధ్య మంచి సానిన్నిహిత్యం ఉండేది. ఆ క్రమంలో నాగబాబు రోజాపై పెద్దగా ఫైర్ కాలేదని తెలుస్తుంది. ఏదేమైన పవన్ కళ్యాణ్ రాజకీయ ఎంట్రీతో ఏపీలో రాజకీయ వాతావరణం చాలా వాడి వేడిగా ఉంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…