Ajith Thegimpu Movie : థియేటర్స్లో విడుదలైన కొద్ది రోజులకి సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అజిత్ నటించిన తెగింపు చిత్రం సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించగా, ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అజిత్ సినిమా అంటే తమిళంతో పాటు తెలుగులోనూ హైప్ బాగానే ఉంటుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించారు. ఇక ఈ సినిమాలో అజిత్ సరికొత్త లుక్లో అల్ట్రా స్టైలిష్ స్వాగ్తో కనిపించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తునివు సినిమా రిలీజ్కు ముందే, ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
అయితే తెగింపు సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండడంతో పాటు అజిత్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆక్టుటకోవడంలో సక్సెస్ అయ్యింది. రొటీన్ కథ అయినా, సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. అయితే ఈ సినిమాకు తమిళంలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాకు వసూళ్లు కూడా బాగానే వచ్చాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జనవరి 11న విడుదలైన ఈ సినిమా.. రిలీజైన నెల రోజులకే ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుందని అంటున్నారు.
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. తెగింపు మూవీ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. కాగా.. స్ట్రీమింగ్ వచ్చేసి ఫిబ్రవరి 10 నుండి కానుందని తెలుస్తుంది.. అయితే ఈ విషయంపై మేకర్స్ అయితే క్లారిటీ ఇవ్వలేదు. కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఓటీటీలో ఈ సినిమాని చూసేందుకు తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బ్యాంకు మోసాల నేపథ్యంలోనే ఈ సినిమా కథ రాసుకున్నాడు దర్శకుడు వినోద్. ఇదే కథను కాస్త అటూ ఇటూగా సర్కారు వారి పాటలో మహేష్ బాబుతో చెప్పించాడు దర్శకుడు పరశురామ్. అందులోనూ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన బడా వ్యక్తుల గురించి చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…