Naga Chaitanya : విక్రమ్ కుమార్ దర్శకత్వంలో.. నాగచైతన్య, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం.. థాంక్ యూ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 22వ తేదీన రిలీజ్కు రెడీగా ఉంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇక రాశి ఖన్నా, నాగచైతన్యలతోపాటు ఇందులో నటించిన మాళవికా నాయర్, అవికా గోర్లు చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అందులో భాగంగానే వారు పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇక తాజాగా చైతూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
థాంక్ యూ చిత్ర ప్రమోషన్లలో భాగంగా చైతన్య మాట్లాడుతూ.. తాను జీవితంలో ముగ్గురు వ్యక్తులకు థాంక్స్ చెబుదామని అనుకుంటున్నానని అన్నాడు. మొదట తన తల్లికి థాంక్స్ చెప్పాడు. ఆమె చిన్నప్పటి నుంచి తనను ఎంతో ప్రేమగా చూసుకుంటూ పెంచిందని తెలిపాడు. తనకు అంతులేని ప్రేమను పంచిందన్నాడు. అందువల్ల ఆమెకు థాంక్యూ చెబుతున్నానని అన్నాడు. ఇక తన తండ్రి కూడా తన ఆలనా పాలనా చూశారని.. ఆయన తన ఫ్రెండ్లా తనను భావిస్తారని చైతూ తెలిపాడు. కనుక నాగార్జునకు థాంక్స్ చెబుతున్నానని అన్నాడు.
ఇక మూడోది వ్యక్తి కాదు.. కుక్క పిల్ల. అవును.. అది సమంత దగ్గర ఉండేది. దాన్ని ఆమెనే అప్పట్లో తీసుకువచ్చింది. దాని పేరు హష్. హష్ అంటే తనకు ప్రాణమని.. తన వెనుకనే తిరిగేదని.. సొంత మనిషిలా చూసుకునేదని నాగచైతన్య ఎమోషనల్ అయ్యాడు. దానికి కూడా థ్యాంక్స్ చెబుతున్నట్లు తెలిపాడు. అయితే ఇప్పుడు హష్ చైతూ దగ్గర లేదు. సమంతతో విడిపోయాక ఆమె తన కుక్కను తాను తీసుకెళ్లింది. ఇక ఆమె దగ్గర హష్తోపాటు సాషా అనే ఇంకో కుక్క పిల్ల కూడా ఉంది. అయితే సమంత దగ్గర ఉన్న కుక్క పిల్లను తలచుకుని చైతూ ఎమోషనల్ అవడం అందరినీ షాక్కు గురి చేస్తోంది. చూస్తుంటే సమంత కన్నా హష్తోనే చైతూకు అనుబంధం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…