Naga Chaitanya : విక్రమ్ కుమార్ దర్శకత్వంలో.. నాగచైతన్య, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం.. థాంక్ యూ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 22వ తేదీన రిలీజ్కు రెడీగా ఉంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇక రాశి ఖన్నా, నాగచైతన్యలతోపాటు ఇందులో నటించిన మాళవికా నాయర్, అవికా గోర్లు చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అందులో భాగంగానే వారు పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇక తాజాగా చైతూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
థాంక్ యూ చిత్ర ప్రమోషన్లలో భాగంగా చైతన్య మాట్లాడుతూ.. తాను జీవితంలో ముగ్గురు వ్యక్తులకు థాంక్స్ చెబుదామని అనుకుంటున్నానని అన్నాడు. మొదట తన తల్లికి థాంక్స్ చెప్పాడు. ఆమె చిన్నప్పటి నుంచి తనను ఎంతో ప్రేమగా చూసుకుంటూ పెంచిందని తెలిపాడు. తనకు అంతులేని ప్రేమను పంచిందన్నాడు. అందువల్ల ఆమెకు థాంక్యూ చెబుతున్నానని అన్నాడు. ఇక తన తండ్రి కూడా తన ఆలనా పాలనా చూశారని.. ఆయన తన ఫ్రెండ్లా తనను భావిస్తారని చైతూ తెలిపాడు. కనుక నాగార్జునకు థాంక్స్ చెబుతున్నానని అన్నాడు.
ఇక మూడోది వ్యక్తి కాదు.. కుక్క పిల్ల. అవును.. అది సమంత దగ్గర ఉండేది. దాన్ని ఆమెనే అప్పట్లో తీసుకువచ్చింది. దాని పేరు హష్. హష్ అంటే తనకు ప్రాణమని.. తన వెనుకనే తిరిగేదని.. సొంత మనిషిలా చూసుకునేదని నాగచైతన్య ఎమోషనల్ అయ్యాడు. దానికి కూడా థ్యాంక్స్ చెబుతున్నట్లు తెలిపాడు. అయితే ఇప్పుడు హష్ చైతూ దగ్గర లేదు. సమంతతో విడిపోయాక ఆమె తన కుక్కను తాను తీసుకెళ్లింది. ఇక ఆమె దగ్గర హష్తోపాటు సాషా అనే ఇంకో కుక్క పిల్ల కూడా ఉంది. అయితే సమంత దగ్గర ఉన్న కుక్క పిల్లను తలచుకుని చైతూ ఎమోషనల్ అవడం అందరినీ షాక్కు గురి చేస్తోంది. చూస్తుంటే సమంత కన్నా హష్తోనే చైతూకు అనుబంధం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతోంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…