Naga Chaitanya : ఏ మాయ చేసావే సినిమాలో జంటగా నటించి, నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చై సామ్ అని పిలుచుకుంటారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. విడాకుల అనంతరం కూడా వీళ్ళు మళ్లీ ఒకటవుతారనే అనేక మంది అభిమానులు భవిస్తూ వచ్చారు కానీ కొన్నాళ్ళకు అలా జరిగే అవకాశం లేదని అర్థం అయింది. సమంత, నాగచైతన్య విడాకులకు ముందు చాలా సినిమాల్లో కలిసి నటించారు.
వీరిద్దరూ కలిసి నటించిన మనం, మజిలీ, ఏ మాయ చేసావే సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే వీటిలో మజిలీలో మాత్రం పెళ్లి తర్వాత నటించారు. ఇదిలా వుండగా డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఏం మాయ చేసావే సినిమాకు సీక్వెల్ తీస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇప్పుడు సమంత, నాగచైతన్య పేర్లు ట్రెండింగ్ లో నిలిచాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గౌతమ్ ఇప్పటికే సమంతతో మాట్లాడారని సమంత.. నాగచైతన్యతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉందని సమాచారం.
గతంలో నాగచైతన్యకి ఇదే ప్రశ్న ఎదురైతే భవిష్యత్తులో సమంతతో కలిసి నటిస్తారా అంటే.. నో అయితే చెప్పనని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కచ్చితంగా తెరపై మళ్ళీ నాగచైతన్య, సమంతల జంట ట్రెండ్ సెట్ చేస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకటైనా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఏం మాయ చేసావే 2 కి స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ అవుతుందో..? మళ్లీ ఇద్దరిని మనం ఎప్పుడు తెరపై చూస్తామో..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…