Naga Chaitanya : ఏ మాయ చేసావే సినిమాలో జంటగా నటించి, నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చై సామ్ అని పిలుచుకుంటారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. విడాకుల అనంతరం కూడా వీళ్ళు మళ్లీ ఒకటవుతారనే అనేక మంది అభిమానులు భవిస్తూ వచ్చారు కానీ కొన్నాళ్ళకు అలా జరిగే అవకాశం లేదని అర్థం అయింది. సమంత, నాగచైతన్య విడాకులకు ముందు చాలా సినిమాల్లో కలిసి నటించారు.
వీరిద్దరూ కలిసి నటించిన మనం, మజిలీ, ఏ మాయ చేసావే సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే వీటిలో మజిలీలో మాత్రం పెళ్లి తర్వాత నటించారు. ఇదిలా వుండగా డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఏం మాయ చేసావే సినిమాకు సీక్వెల్ తీస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇప్పుడు సమంత, నాగచైతన్య పేర్లు ట్రెండింగ్ లో నిలిచాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గౌతమ్ ఇప్పటికే సమంతతో మాట్లాడారని సమంత.. నాగచైతన్యతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉందని సమాచారం.
గతంలో నాగచైతన్యకి ఇదే ప్రశ్న ఎదురైతే భవిష్యత్తులో సమంతతో కలిసి నటిస్తారా అంటే.. నో అయితే చెప్పనని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కచ్చితంగా తెరపై మళ్ళీ నాగచైతన్య, సమంతల జంట ట్రెండ్ సెట్ చేస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకటైనా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఏం మాయ చేసావే 2 కి స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ అవుతుందో..? మళ్లీ ఇద్దరిని మనం ఎప్పుడు తెరపై చూస్తామో..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…