Naga Babu : రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. పవన్, జనసేన అభిమానులు ఓ వైపు.. వైసీపీ అభిమానులు మరోవైపు ఉండి మాటల యుద్ధం చేస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి హీట్ పెరిగింది. ఈ క్రమంలోనే పోసాని వ్యాఖ్యలపై ఇప్పటికే అభిమానులు భగ్గమంటూ ఆయనపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు.
ఇక మెగా డాటర్ నిహారిక కూడా పోసాని వ్యాఖ్యలకు కౌంటర్ వేసింది. పోసానికి పిచ్చి పట్టిందని, ఆయనను వెంటనే మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని, ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే నాగబాబు కూడా ఈ విషయమై అభిమానుల ముందుకు వచ్చారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన అభిమానులతో ముచ్చటించారు. ఆస్క్ మీ.. పేరిట ఆయన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు.
ఇన్స్టాగ్రామ్లో అభిమానులు అడిగే ప్రశ్నలకు నాగబాబు సమాధానాలు చెబుతూనే మరోవైపు మీమ్స్, క్లిప్స్, ఫొటోలతో సెటైర్లు వేశారు. అనేక ప్రశ్నలకు ఆయన మీమ్స్ ద్వారానే సమాధానాలు చెప్పారు. ఏపీలో ఆన్లైన్లో సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే అమ్మడంపై నాగబాబు సెటైర్ వేశారు. రవితేజ, బ్రహ్మానందం నటించిన విక్రమార్కుడు సినిమాలోని ఓ క్లిప్ను ఆయన షేర్ చేశారు. ఆ విధంగా ఏపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆయన పరోక్షంగా చెప్పారు.
ఇక మంత్రి పేర్ని నానిపై కూడా ఘాటుగా సెటైర్ వేశారు నాగబాబు. మంత్రి పేర్ని నాని ప్రపంచం ఇదే.. అంటూ చెత్త కుప్ప ఫొటోను నాగబాబు షేర్ చేశారు. ఏపీని అమ్మేసి వచ్చే డబ్బులతో మంత్రి పేర్ని నానికి వైద్యం చేయిద్దాం అంటూ.. ఘాటుగా విమర్శించారు.
అలాగే ఆన్లైన్ మూవీ టిక్కెట్ల అమ్మకంపై అడిగిన ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ.. కంటెంట్ ఉన్నవాడికి కటౌట్తో పనిలేదని అన్నారు. పోసాని గురించి ఒక్క మాటలో సమాధానం చెప్పాలని అడగ్గా.. అందుకు నాగబాబు స్పందిస్తూ.. సమరసింహారెడ్డిలోని ఒక ఫొటో షేర్ చేశారు. బాలయ్య చెప్పినట్లుగా కుక్కలు మొరిగాయని అనుకో.. అంటూ నాగబాబు సమాధానం ఇచ్చారు.
కాగా మీరు ఏ బ్రాండ్ మందు తాగుతారని అడగ్గా.. అందుకు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలను షేర్ చేశారు. గుండెల్లో గోదారి ఫంక్షన్లో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలను నాగబాబు షేర్ చేశారు. ఇలా రోజు రోజుకీ మాటల యుద్ధం పెరిగిపోతోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…