Naga Babu : రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. పవన్, జనసేన అభిమానులు ఓ వైపు.. వైసీపీ అభిమానులు మరోవైపు ఉండి మాటల యుద్ధం చేస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి హీట్ పెరిగింది. ఈ క్రమంలోనే పోసాని వ్యాఖ్యలపై ఇప్పటికే అభిమానులు భగ్గమంటూ ఆయనపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు.
ఇక మెగా డాటర్ నిహారిక కూడా పోసాని వ్యాఖ్యలకు కౌంటర్ వేసింది. పోసానికి పిచ్చి పట్టిందని, ఆయనను వెంటనే మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని, ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే నాగబాబు కూడా ఈ విషయమై అభిమానుల ముందుకు వచ్చారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన అభిమానులతో ముచ్చటించారు. ఆస్క్ మీ.. పేరిట ఆయన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు.
ఇన్స్టాగ్రామ్లో అభిమానులు అడిగే ప్రశ్నలకు నాగబాబు సమాధానాలు చెబుతూనే మరోవైపు మీమ్స్, క్లిప్స్, ఫొటోలతో సెటైర్లు వేశారు. అనేక ప్రశ్నలకు ఆయన మీమ్స్ ద్వారానే సమాధానాలు చెప్పారు. ఏపీలో ఆన్లైన్లో సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే అమ్మడంపై నాగబాబు సెటైర్ వేశారు. రవితేజ, బ్రహ్మానందం నటించిన విక్రమార్కుడు సినిమాలోని ఓ క్లిప్ను ఆయన షేర్ చేశారు. ఆ విధంగా ఏపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆయన పరోక్షంగా చెప్పారు.
ఇక మంత్రి పేర్ని నానిపై కూడా ఘాటుగా సెటైర్ వేశారు నాగబాబు. మంత్రి పేర్ని నాని ప్రపంచం ఇదే.. అంటూ చెత్త కుప్ప ఫొటోను నాగబాబు షేర్ చేశారు. ఏపీని అమ్మేసి వచ్చే డబ్బులతో మంత్రి పేర్ని నానికి వైద్యం చేయిద్దాం అంటూ.. ఘాటుగా విమర్శించారు.
అలాగే ఆన్లైన్ మూవీ టిక్కెట్ల అమ్మకంపై అడిగిన ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ.. కంటెంట్ ఉన్నవాడికి కటౌట్తో పనిలేదని అన్నారు. పోసాని గురించి ఒక్క మాటలో సమాధానం చెప్పాలని అడగ్గా.. అందుకు నాగబాబు స్పందిస్తూ.. సమరసింహారెడ్డిలోని ఒక ఫొటో షేర్ చేశారు. బాలయ్య చెప్పినట్లుగా కుక్కలు మొరిగాయని అనుకో.. అంటూ నాగబాబు సమాధానం ఇచ్చారు.
కాగా మీరు ఏ బ్రాండ్ మందు తాగుతారని అడగ్గా.. అందుకు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలను షేర్ చేశారు. గుండెల్లో గోదారి ఫంక్షన్లో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలను నాగబాబు షేర్ చేశారు. ఇలా రోజు రోజుకీ మాటల యుద్ధం పెరిగిపోతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…