Naga Babu : రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. పవన్, జనసేన అభిమానులు ఓ వైపు.. వైసీపీ అభిమానులు మరోవైపు ఉండి మాటల యుద్ధం చేస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి హీట్ పెరిగింది. ఈ క్రమంలోనే పోసాని వ్యాఖ్యలపై ఇప్పటికే అభిమానులు భగ్గమంటూ ఆయనపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు.
ఇక మెగా డాటర్ నిహారిక కూడా పోసాని వ్యాఖ్యలకు కౌంటర్ వేసింది. పోసానికి పిచ్చి పట్టిందని, ఆయనను వెంటనే మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని, ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే నాగబాబు కూడా ఈ విషయమై అభిమానుల ముందుకు వచ్చారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన అభిమానులతో ముచ్చటించారు. ఆస్క్ మీ.. పేరిట ఆయన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు.
ఇన్స్టాగ్రామ్లో అభిమానులు అడిగే ప్రశ్నలకు నాగబాబు సమాధానాలు చెబుతూనే మరోవైపు మీమ్స్, క్లిప్స్, ఫొటోలతో సెటైర్లు వేశారు. అనేక ప్రశ్నలకు ఆయన మీమ్స్ ద్వారానే సమాధానాలు చెప్పారు. ఏపీలో ఆన్లైన్లో సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే అమ్మడంపై నాగబాబు సెటైర్ వేశారు. రవితేజ, బ్రహ్మానందం నటించిన విక్రమార్కుడు సినిమాలోని ఓ క్లిప్ను ఆయన షేర్ చేశారు. ఆ విధంగా ఏపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆయన పరోక్షంగా చెప్పారు.
ఇక మంత్రి పేర్ని నానిపై కూడా ఘాటుగా సెటైర్ వేశారు నాగబాబు. మంత్రి పేర్ని నాని ప్రపంచం ఇదే.. అంటూ చెత్త కుప్ప ఫొటోను నాగబాబు షేర్ చేశారు. ఏపీని అమ్మేసి వచ్చే డబ్బులతో మంత్రి పేర్ని నానికి వైద్యం చేయిద్దాం అంటూ.. ఘాటుగా విమర్శించారు.
అలాగే ఆన్లైన్ మూవీ టిక్కెట్ల అమ్మకంపై అడిగిన ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ.. కంటెంట్ ఉన్నవాడికి కటౌట్తో పనిలేదని అన్నారు. పోసాని గురించి ఒక్క మాటలో సమాధానం చెప్పాలని అడగ్గా.. అందుకు నాగబాబు స్పందిస్తూ.. సమరసింహారెడ్డిలోని ఒక ఫొటో షేర్ చేశారు. బాలయ్య చెప్పినట్లుగా కుక్కలు మొరిగాయని అనుకో.. అంటూ నాగబాబు సమాధానం ఇచ్చారు.
కాగా మీరు ఏ బ్రాండ్ మందు తాగుతారని అడగ్గా.. అందుకు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలను షేర్ చేశారు. గుండెల్లో గోదారి ఫంక్షన్లో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలను నాగబాబు షేర్ చేశారు. ఇలా రోజు రోజుకీ మాటల యుద్ధం పెరిగిపోతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…