Mukul Rohatgi : ఎన్సీబీ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్యన్ఖాన్కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. బాంబే హైకోర్టు ఆర్యన్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే దాదాపుగా 20 రోజులకు పైగానే ఆర్యన్ జైలులో ఉన్నాడు. పైగా షారూఖ్ఖాన్కు చెందిన లీగల్ టీమ్లో హేమాహేమీల్లాంటి లాయర్లు ఉన్నారు. అయినప్పటికీ ఆర్యన్కు బెయిల్ తేవడంలో విఫలం అయ్యారు.
అయితే వచ్చీరాగానే ముకుల్ రోహత్గీ బలమైన వాదనలు వినిపించి చాలా సులభంగా బెయిల్ వచ్చేలా చేశారు. దీంతో ఆయన పేరు మార్మోగిపోతోంది. అయితే ఇంతకీ అసలు ముకుల్ రోహత్గీ ఎవరు ? ఈయన విశేషాలు ఏమిటి ? అంటే..
ముకుల్ రోహత్గీ 14వ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. ఈయనకు 66 ఏళ్లు. సుప్రీం కోర్టు సీనియర్ లాయర్గా ఈయనకు అపారమైన అనుభవం ఉంది. అలాగే గతంలో ఈయన అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవిలోనూ పనిచేశారు. 2014 నుంచి 2017 వరకు ఈయన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు.
అనేక సంక్లిష్టమైన కేసులను వాదించిన లాయర్ గా ఆయనకు పేరుంది. ఈయన 2002 గుజరాత్ అల్లర్ల కేసులో గుజరాత్ ప్రభుత్వం తరఫున కోర్టులో వాదించారు. అలాగే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ కు సంబంధించిన కేసులో అడిషనల్ సాలిసిటర్ జనరల్గా ఈయన అద్భుతంగా పనిచేశారు.
సీబీఐ స్పెషల్ జడ్జి బీహెచ్ లోయా మృతి కేసులో ఈయన ప్రత్యేక ప్రాసిక్యూటర్గా నియామకం అయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం అందుకు ఈయనకు రూ.1.20 కోట్ల ఫీజును చెల్లించింది. అది ఒక హైప్రొఫైల్ కేసు కావడం విశేషం. ఈ కేసులో విచారణ చేయాలని వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దీంతో ముకుల్ రోహత్గీ కోర్టు నిర్ణయాన్ని్ స్వాగతించారు. ఇది ఏప్రిల్ 2018లో జరిగింది.
ఇక మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి ముకుల్ రోహత్గీ స్నేహితులు. తమ స్నేహం గురించి ఇద్దరూ అప్పుడప్పుడు చెబుతుండేవారు. ఇక ముకుల్ రోహత్గీ తండ్రి జడ్జి కావడం విశేషం. ఆయన పేరు అవధ్ బెహరి రోహత్గీ. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. తండ్రి అడుగుజాడల్లోనే ముకుల్ రోహత్గీ నడిచారు. గొప్ప లాయర్గా పేరు తెచ్చుకున్నారు. ముంబైలోని ప్రభుత్వ లా కాలేజీలో న్యాయశాస్త్రం చదివారు. తరువాత న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.
ప్రారంభంలో ఆయన యోగేష్ కుమార్ సభర్వాల్ వద్ద పనిచేశారు. తరువాత ఢిల్లీ హైకోర్టుకు 36వ చీఫ్ జస్టిస్గా పనిచేశారు. అనంతరం సొంతంగా సీనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1993లో ముకుల్ రోహత్గీ ఢిల్లీ హైకోర్టు చేత సీనియర్ కౌన్సిల్గా నియామకం అయ్యారు. అనంతరం 1999లో అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియామకం అయ్యారు. ఆయన భార్య పేరు సుధ. ఆమె కూడా లాయర్. కాగా ఆయనకు ఒక కుమారుడు ఉన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…