Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ అంటేనే ఒక ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంటాడు. ఆయన క్రికెట్ ప్రపంచంలోకి కొత్తగా అడుగు పెట్టినప్పుడు జులపాల జుట్టుతో అందరినీ ఆకట్టుకున్నాడు. తరువాత కూడా తన హెయిర్ స్టైల్స్ను మారుస్తూ వచ్చాడు. అయితే ధోనీ అంటే చాలా మంది క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఎందుకంటే ధోనీ మిస్టర్ కూల్గా పేరు తెచ్చుకున్నాడు. బయట ఎంత కూల్గా ఉంటాడో మైదానంలో ఉత్కంఠభరిమైన మ్యాచ్ జరిగినా కూడా అంతే కూల్గా ధోనీ దర్శనమిస్తాడు. కనుకనే ధోనీని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తారు. ఇక ధోనీ కెప్టెన్సీలో భారత్ టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలను సాధించింది. అందుకని ధోనీ అంటే క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. అయితే తాజాగా ఆయన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ధోనీ తన బ్యాట్ను తింటూ కనిపించాడు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ధోనీ 8 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే చెన్నై జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కానీ ఢిల్లీ 17.4 ఓవర్లలో 117 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో చెన్నై ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్లో చెన్నై ఇన్నింగ్స్ సందర్భంగా ధోనీ బ్యాటింగ్ కోసం డగౌట్లో వేచి చూస్తున్నప్పుడు తన బ్యాట్ను తింటూ కనిపించాడు. ఇలా అతను ఎందుకు చేశాడని.. ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. అయితే దీనికి లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చాడు.
ధోనీ తన బ్యాట్ను అలా ఎందుకు తింటున్నాడు.. అని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. దీని వెనుక పెద్ద విషయం ఏమీ లేదు. ఆయనకు ఆకలి అయి అలా చేయలేదు. ఏ బ్యాట్స్మన్ అయినా సరే తన బ్యాట్ను నీట్గా ఉంచుకోవాలని చూస్తాడు. అందులో భాగంగానే బ్యాట్ నుంచి బయటకు వచ్చే చిన్న చిన్న చెక్కలు, దారాలను తీసేస్తుంటారు. అయితే వాటిని కత్తెర సహాయంతో కట్ చేస్తారు. కానీ మ్యాచ్ సందర్భంగా అవి అందుబాటులో లేవేమో.. కనుకనే ధోనీ వాటిని నోటితో తీసేశాడు. అందుకనే బ్యాట్ను అతను కొరికి ఉంటాడు.. అంతేకానీ.. అతనికి ఆకలై కాదు.. అని అమిత్ మిశ్రా సమాధానం చెప్పాడు. దీంతో ఆయన ట్వీట్ వైరల్గా మారింది. అలాగే ధోనీ ఫొటో కూడా వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…