Venu Swamy : అక్కినేని నాగచైతన్య, సమంత తమ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు గతేడాది అక్టోబర్ లో వెల్లడించారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. టాలీవుడ్ క్యూట్ కపుల్గా ఉన్నవీరు అసలు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో తెలియక చాలా మంది అనేక సందేహాలను వ్యక్తం చేశారు. అయితే అది గతం. ఇప్పుడు ఎవరి సినిమాలతో వారు బిజీగా మారిపోయారు. కానీ వీరి వివాహం నిలబడదని.. పెళ్లి అయినా సరే కలహాల కారణంగా విడిపోతారని.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అప్పట్లో చెప్పారు. ఆయన చెప్పినట్లే వారు విడిపోయారు. దీంతో ఆయన జ్యోతిష్యంపై గురి కుదిరింది.
గతంలో వేణు స్వామి జగన్ సీఎం అవుతారని చెప్పారు. అలాగే జరిగింది కూడా. ఈ క్రమంలోనే వేణు స్వామి జ్యోతిష్యం అంటే చాలా మందికి నమ్మకం ఏర్పడింది. అయితే ఈయన తాజాగా నయనతార జాతకం చూశారు. ఈ క్రమంలోనే ఆయన షాకింగ్ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆమె జాతకంలో గురుడు నీచ స్థితిలో ఉన్నాడని.. కనుక ఆమె ఇప్పుడు వివాహం చేసుకోవద్దని చెప్పారు. చేసుకున్నా వారు విడిపోతారని అన్నారు. అయితే నయనతార తన ప్రియుడు విగ్నేష్ శివన్తో కలిసి ఇప్పటికే పలు ఆలయాలను సందర్శించి అనేక సార్లు పూజలు చేశారు. చూస్తుంటే వారికి కూడా ఈ విషయం ముందుగానే తెలుసని.. కనుకనే వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా దాంపత్యం అన్యోన్యంగా ఉండేందుకు వారు ముందుగానే శాంతి పూజలు చేశారని తెలుస్తోంది.
అయితే వారు పూజలు చేశారు కనుక వేణు స్వామి చెప్పినట్లు జరగకపోవచ్చని అంటున్నారు. గ్రహ దోషాలు, జాతకంలో దోషాలు ఉన్నప్పుడు పూజలు చేయడం సర్వసాధారణం. కనుక ఈసారి మాత్రం ఆయన జ్యోతిష్యం ఫలించదని.. నయనతార, విగ్నేష్ శివన్ క్యూట్ కపుల్గా జీవనం సాగిస్తారని అంటున్నారు. ఇక ఈ విషయం తెలియాలంటే.. కొంత కాలం వరకు ఆగాల్సిందే. అయితే వేణు స్వామి గతంలో ఒకసారి అనుష్క శెట్టి, ప్రభాస్ వంటి స్టార్స్ జాతకాలపై కూడా కామెంట్లు చేశారు. అనుష్క శెట్టి వివాహం ఇప్పట్లో కాదని.. ప్రభాస్కు అయితే ఇంకో ఏడాదిన్నరలో వివాహం అవుతుందని అన్నారు. మరి ఆయన చెప్పింది జరుగుతుందో లేదో చూడాలి.
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…