మొబైల్స్ తయారీదారు మోటోరోలా మరో అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మోటో జి32 పేరిట లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్లో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది.
ఈ ఫోన్లో ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ను ఏర్పాటు చేశారు. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తాయి. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. దీన్ని భవిష్యత్తుల్లో ఆండ్రాయిడ్ 13 కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. అలాగే హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ ఫీచర్ ఇందులో ఉంది.
ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేయగా, మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇంకో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా ఉంది. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్కు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను పక్క భాగంలో ఏర్పాటు చేశారు. ఇందులో డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి టర్బో చార్జింగ్ ఫీచర్ను అందిస్తున్నారు.
మోటో జి32 స్మార్ట్ ఫోన్ను సాటిన్ సిల్వర్, మినరల్ గ్రే కలర్ ఆప్షన్లలో రిలీజ్ చేశారు. ఈ ఫోన్ ధర రూ.12,999 ఉండగా.. దీన్ని ఆగస్టు 16 నుంచి ఫ్లిప్కార్ట్లో విక్రయించనున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.1250 వరకు డిస్కౌంట్ను పొందవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…