moto e40 : మొబైల్స్ తయారీదారు మోటోరోలా ఇ40 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ ను భారత్లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన మాక్స్ విజన్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీగా ఉంటుంది.
ఇక ఈ ఫోన్లో యూనిసోక్ టి700 ప్రాసెసర్ను అమర్చారు. 4జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా.. మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్లో ఈ ఫోన్ విడుదలైంది. మెమోరీని కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్ను అందిస్తున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను వెనుక వైపు ఏర్పాటు చేశారు. 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లను ఈ ఫోన్లో అందిస్తున్నారు.
మోటో ఇ40 స్మార్ట్ ఫోన్ పింక్ క్లే, కార్బన్ గ్రే కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. ఈ ఫోన్ రూ.9,499 ధరకు అక్టోబర్ 17వ తేదీ నుంచి లభ్యం కానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…