moto e32s : స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా మోటో సిరీస్లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. మోటో ఇ32ఎస్ పేరిట విడుదలైన ఈ ఫోన్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 1600 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ లభిస్తోంది. అలాగే దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది.
ఈ ఫోన్లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి37 ప్రాసెసర్ను అమర్చారు. ఈ ఫోన్ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైంది. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. డ్యుయల్ సిమ్లను, ఒక మెమొరీ కార్డును వేసుకోవచ్చు. వెనుక వైపు 16 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా, ఇంకో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. అలాగే ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
మోటో ఇ32ఎస్ స్మార్ట్ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ను పక్క వైపున ఏర్పాటు చేశారు. ఐపీ 52 వాటర్ రీపెల్లెంట్ ఫీచర్ను దీనికి అందిస్తున్నారు. అందువల్ల నీళ్లు పడితే ఫోన్పై నుంచి వెంటనే పక్కకు వెళ్తాయి. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లను కూడా ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది.
మోటో ఇ32ఎస్ స్మార్ట్ ఫోన్ స్లేట్ గ్రే, మిస్టీ సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండగా.. ఈ ఫోన్కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9299గా ఉంది. అలాగే 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,999గా ఉంది. అయితే ఫ్లిప్కార్ట్, రిలయన్స్ డిజిటల్, జియో మార్ట్ స్టోర్స్లో ఈ ఫోన్ను రూ.8,999 ప్రారంభ ధరకు కొనవచ్చు. ఈ ఆఫర్ను జూన్ 6వ తేదీ వరకే అందిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…