moto e32s : స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా మోటో సిరీస్లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. మోటో ఇ32ఎస్ పేరిట విడుదలైన ఈ ఫోన్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 1600 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ లభిస్తోంది. అలాగే దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది.
ఈ ఫోన్లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి37 ప్రాసెసర్ను అమర్చారు. ఈ ఫోన్ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైంది. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. డ్యుయల్ సిమ్లను, ఒక మెమొరీ కార్డును వేసుకోవచ్చు. వెనుక వైపు 16 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా, ఇంకో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. అలాగే ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
మోటో ఇ32ఎస్ స్మార్ట్ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ను పక్క వైపున ఏర్పాటు చేశారు. ఐపీ 52 వాటర్ రీపెల్లెంట్ ఫీచర్ను దీనికి అందిస్తున్నారు. అందువల్ల నీళ్లు పడితే ఫోన్పై నుంచి వెంటనే పక్కకు వెళ్తాయి. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లను కూడా ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది.
మోటో ఇ32ఎస్ స్మార్ట్ ఫోన్ స్లేట్ గ్రే, మిస్టీ సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండగా.. ఈ ఫోన్కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9299గా ఉంది. అలాగే 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,999గా ఉంది. అయితే ఫ్లిప్కార్ట్, రిలయన్స్ డిజిటల్, జియో మార్ట్ స్టోర్స్లో ఈ ఫోన్ను రూ.8,999 ప్రారంభ ధరకు కొనవచ్చు. ఈ ఆఫర్ను జూన్ 6వ తేదీ వరకే అందిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…