Manushi Chhillar : మిస్ వరల్డ్ గా ఎంపికై చరిత్ర సృష్టించిన మానుషి చిల్లార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె 2017లో ఫెమినా మిస్ ఇండియాగా గెలిచింది. అనంతరం భారత్ తరఫున మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని కిరీటాన్ని సాధించింది. హర్యానాకు చెందిన ఈ ముద్దుగుమ్మ మెడిసిన్ చదువుతూనే మిస్ వరల్డ్గా ఎంపికైంది. ఇక మిస్ వరల్డ్గా ఎంపికైనప్పటికీ ఈమెకు బాలీవుడ్లో అంతగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలోనే ఈమె సామ్రాట్ పృథ్వీరాజ్ అనే మూవీలో అక్షయ్ కుమార్ సరసన నటించింది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్లో ఈమె చిత్ర యూనిట్తో కలిసి పాల్గొంటోంది. ఇక పృథ్వీరాజ్ మూవీ శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కాగా ఇటీవల ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తనకు టాలీవుడ్లో ఏ హీరో అంటే ఇష్టం అని అడగ్గా.. ఠక్కున రామ్ చరణ్ అని జవాబు చెప్పింది. రామ్ చరణ్కు వివాహం అయింది కాబట్టి సరిపోయిందని.. లేకపోతే అతనితో డేటింగ్ చేసేదాన్నని బదులిచ్చింది. ఇక రామ్ చరణ్ తో ఓ మూవీలో నటించాలని అనుకుంటున్నట్లు తెలియజేసింది.
అయితే ప్రస్తుత తరుణంలో టాలీవుడ్ వైపు బాలీవుడ్ భామలు మొగ్గుచూపుతున్నారు. టాలీవుడ్ సినిమాల ఖ్యాతి కూడా పెరిగింది. దీంతో తెలుగు చిత్రాల్లో నటించేందుకు ఇతర భాషలకు చెందిన ముద్దుగుమ్మలు ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగానే మానుషి చిల్లార్ కూడా తన మనసులో మాటను బయట పెట్టింది. అయితే రామ్ చరణ్ అంటే సడెన్ గా ఈమె అంత ప్రేమను ఎందుకు కురిపిస్తుందో అర్థం కావడం లేదని అంటున్నారు. ఆర్ఆర్ఆర్తో పాన్ ఇండియా స్థాయిలో చరణ్కు మంచి గుర్తింపు వచ్చింది. కనుకనే అతనంటే ఆమె ఇష్టపడుతుందా.. అని చర్చించుకుంటున్నారు. ఇక చరణ్తో కలిసి నటించాలన్న ఈమె కోరిక నెరవేరుతుందా.. లేదా.. అన్నది చూడాలి.
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…