రూ.10వేల కోసం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నారు.. ఈయన గురించి తెలిస్తే కన్నీళ్లు వస్తాయి..

కరోనా వల్ల ఎంతో మంది బతుకులు ఛిద్రమయ్యాయి. ఎంతో మంది ఎన్నో రకాలుగా నష్టపోయారు. చాలా మంది తమ ఆత్మీయులను కోల్పోయారు. కొందరు ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను చిన్నా భిన్నం చేసింది. అయితే చాలా మంది ఆర్థికంగా చితికిపోయారు కూడా. అలాంటి వారిలో ఈయన కూడా ఒకరు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

జార్ఖండ్‌లోని హజారిబాగ్‌కు చెందిన మిథిలేష్‌ కుమార్‌ మెహతా 2018లో ఓ కొత్త ట్రాక్టర్‌ కొన్నాడు. అందుకు గాను మహీంద్రా ఫైనాన్స్‌ నుంచి లోన్‌ తీసుకున్నాడు. అంతకు ముందే అతనికి ఉన్న పాత ట్రాక్టర్‌ను ఇచ్చి దానికి వచ్చే మొత్తం పోగా.. ఇంకాస్త మొత్తాన్ని ముందుగా డౌన్‌ పేమెంట్‌ రూపంలో చెల్లించాడు. దీంతో కొత్త ట్రాక్టర్‌ వచ్చింది. మిగిలిన రుణం మొత్తాన్ని 44 వాయిదాల్లో నెలకు రూ.14,300 చొప్పున చెల్లించాల్సి ఉంది. అయితే కరోనా లాక్‌ డౌన్‌ వరకు అంతా సజావుగానే సాగింది. కానీ లాక్‌ డౌన్‌ వల్ల మిథిలేష్‌ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్రమైన సమస్యలు చుట్టుముట్టాయి.

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా పనులు జరగక ఆదాయం రాలేదు. అయినప్పటికీ మిథిలేష్‌ ఎలాగో వాయిదాలు చెల్లిస్తూ వచ్చాడు. తనకు తెలిసిన వారి వద్ద డబ్బును అప్పుగా తీసుకుని రుణాన్ని చెల్లించాడు. అయితే చివరకు 6 వాయిదాలు మిగిలాయి. కానీ అతని వద్ద చెల్లించేందుకు చిల్లి గవ్వ లేదు. దీంతో జరిమానా విధించారు. అయినప్పటికీ రూ.33వేల ఫైన్‌తో మొత్తం రూ.1.22 లక్షలను ఈ ఏడాది సెప్టెంబర్‌ 22 వరకు చెల్లించాలని గడువు పెట్టడంతో.. ఆ మొత్తాన్ని అతను తీర్చేశాడు.

అయితే సెప్టెంబర్‌ 15వ తేదీన ఉన్నట్లుండి ఆ ఫైనాన్స్‌ కంపెనీకి చెందిన రికవరీ ఏజెంట్లు మిథిలేష్‌ ఇంటికి వచ్చారు. రుణం ఇంకా రూ.10వేలు ఉందని అది చెల్లించాలని లేదంటే ట్రాక్టర్‌ను తీసుకెళ్తామని చెప్పారు. అయితే మిథిలేష్‌ కుమార్తె మోనిక (22) అక్కడే ఉండి లోన్‌ మొత్తం చెల్లించామని.. ఒక్క రూపాయి కూడా పెండింగ్‌ లేదని చెప్పింది. కానీ ఆ ఏజెంట్లు కొన్ని పేపర్లు చూపించి ఇంకా రూ.10వేలు రావల్సి ఉందని అన్నారు. అయితే తమ వద్ద డబ్బు లేదని చెప్పగా.. ఆ ఏజెంట్లు ఆ ట్రాక్టర్‌ను తీసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో మిథిలేష్‌, మోనిక ఇద్దరూ ట్రాక్టర్‌కు అడ్డు పడ్డారు. అయితే కనికరం లేని ఏజెంట్లు మోనిక మీదుగా ట్రాక్టర్‌ను రెండు సార్లు పోనిచ్చారు. గర్భంతో ఉన్న ఆమెకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ క్రమంలోనే సదరు ఏజెంట్లపై కేసు నమోదు చేశారు.

అయితే కేవలం రూ.10వేల కోసం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నారని మిథిలేష్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే అతను పడుతున్న బాధ వర్ణనాతీతం. అయితే మరోవైపు మహీంద్రా ఫైనాన్స్‌ సంస్థ స్పందించి మిథిలేష్‌కు సారీ చెప్పింది. అయినప్పటికీ రికవరీ ఏజెంట్లు చేసింది మాత్రం క్షమించరాని నేరం అని అందరూ అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్రభాస్ ‘కల్కి 2’ లో సాయి పల్లవి ఎంట్రీ? దీపికా స్థానాన్ని భర్తీ చేసేది ఈమెనేనా!

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…

Wednesday, 28 January 2026, 4:55 PM

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇండియా పోస్ట్‌లో 28,740 ఉద్యోగాలు.. జనవరి 31 నుంచే అప్లికేషన్లు షురూ!

భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…

Wednesday, 28 January 2026, 3:07 PM

‘దేవర 2’ షూటింగ్ ఎప్పుడు? అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇక పండగే!

జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…

Wednesday, 28 January 2026, 12:12 PM

వివో నుంచి మరో పవర్ ఫుల్ ఫోన్.. భారత్‌లో Vivo X200T లాంచ్.. ఫీచర్లు, ధర చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…

Tuesday, 27 January 2026, 9:25 PM

ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే మొబైల్ నంబర్ అప్‌డేట్..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…

Tuesday, 27 January 2026, 7:39 PM

మెగాస్టార్ చిరంజీవికి చిన్మయి బిగ్ కౌంటర్.. ‘కమిట్‌మెంట్’ అంటే అది కాదు, అబద్ధం చెప్పకండి అంటూ ఫైర్!

70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…

Tuesday, 27 January 2026, 5:49 PM

పది పాసైతే చాలు.. ఆర్‌బీఐలో 572 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు.. అప్లై చేయడానికి లింక్ ఇదే!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…

Tuesday, 27 January 2026, 2:59 PM

లోకేష్ కనగరాజ్‌పై ఫ్యాన్స్ ఫైర్.. ‘మీకు కలెక్షన్లే కావాలా.. కథ అక్కర్లేదా?’ అంటూ నెటిజన్ల ట్రోలింగ్!

ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…

Tuesday, 27 January 2026, 9:45 AM