రూ.10వేల కోసం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నారు.. ఈయన గురించి తెలిస్తే కన్నీళ్లు వస్తాయి..

కరోనా వల్ల ఎంతో మంది బతుకులు ఛిద్రమయ్యాయి. ఎంతో మంది ఎన్నో రకాలుగా నష్టపోయారు. చాలా మంది తమ ఆత్మీయులను కోల్పోయారు. కొందరు ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను చిన్నా భిన్నం చేసింది. అయితే చాలా మంది ఆర్థికంగా చితికిపోయారు కూడా. అలాంటి వారిలో ఈయన కూడా ఒకరు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

జార్ఖండ్‌లోని హజారిబాగ్‌కు చెందిన మిథిలేష్‌ కుమార్‌ మెహతా 2018లో ఓ కొత్త ట్రాక్టర్‌ కొన్నాడు. అందుకు గాను మహీంద్రా ఫైనాన్స్‌ నుంచి లోన్‌ తీసుకున్నాడు. అంతకు ముందే అతనికి ఉన్న పాత ట్రాక్టర్‌ను ఇచ్చి దానికి వచ్చే మొత్తం పోగా.. ఇంకాస్త మొత్తాన్ని ముందుగా డౌన్‌ పేమెంట్‌ రూపంలో చెల్లించాడు. దీంతో కొత్త ట్రాక్టర్‌ వచ్చింది. మిగిలిన రుణం మొత్తాన్ని 44 వాయిదాల్లో నెలకు రూ.14,300 చొప్పున చెల్లించాల్సి ఉంది. అయితే కరోనా లాక్‌ డౌన్‌ వరకు అంతా సజావుగానే సాగింది. కానీ లాక్‌ డౌన్‌ వల్ల మిథిలేష్‌ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్రమైన సమస్యలు చుట్టుముట్టాయి.

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా పనులు జరగక ఆదాయం రాలేదు. అయినప్పటికీ మిథిలేష్‌ ఎలాగో వాయిదాలు చెల్లిస్తూ వచ్చాడు. తనకు తెలిసిన వారి వద్ద డబ్బును అప్పుగా తీసుకుని రుణాన్ని చెల్లించాడు. అయితే చివరకు 6 వాయిదాలు మిగిలాయి. కానీ అతని వద్ద చెల్లించేందుకు చిల్లి గవ్వ లేదు. దీంతో జరిమానా విధించారు. అయినప్పటికీ రూ.33వేల ఫైన్‌తో మొత్తం రూ.1.22 లక్షలను ఈ ఏడాది సెప్టెంబర్‌ 22 వరకు చెల్లించాలని గడువు పెట్టడంతో.. ఆ మొత్తాన్ని అతను తీర్చేశాడు.

అయితే సెప్టెంబర్‌ 15వ తేదీన ఉన్నట్లుండి ఆ ఫైనాన్స్‌ కంపెనీకి చెందిన రికవరీ ఏజెంట్లు మిథిలేష్‌ ఇంటికి వచ్చారు. రుణం ఇంకా రూ.10వేలు ఉందని అది చెల్లించాలని లేదంటే ట్రాక్టర్‌ను తీసుకెళ్తామని చెప్పారు. అయితే మిథిలేష్‌ కుమార్తె మోనిక (22) అక్కడే ఉండి లోన్‌ మొత్తం చెల్లించామని.. ఒక్క రూపాయి కూడా పెండింగ్‌ లేదని చెప్పింది. కానీ ఆ ఏజెంట్లు కొన్ని పేపర్లు చూపించి ఇంకా రూ.10వేలు రావల్సి ఉందని అన్నారు. అయితే తమ వద్ద డబ్బు లేదని చెప్పగా.. ఆ ఏజెంట్లు ఆ ట్రాక్టర్‌ను తీసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో మిథిలేష్‌, మోనిక ఇద్దరూ ట్రాక్టర్‌కు అడ్డు పడ్డారు. అయితే కనికరం లేని ఏజెంట్లు మోనిక మీదుగా ట్రాక్టర్‌ను రెండు సార్లు పోనిచ్చారు. గర్భంతో ఉన్న ఆమెకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ క్రమంలోనే సదరు ఏజెంట్లపై కేసు నమోదు చేశారు.

అయితే కేవలం రూ.10వేల కోసం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నారని మిథిలేష్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే అతను పడుతున్న బాధ వర్ణనాతీతం. అయితే మరోవైపు మహీంద్రా ఫైనాన్స్‌ సంస్థ స్పందించి మిథిలేష్‌కు సారీ చెప్పింది. అయినప్పటికీ రికవరీ ఏజెంట్లు చేసింది మాత్రం క్షమించరాని నేరం అని అందరూ అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM

28 రోజుల రీచార్జ్ ప్లాన్‌ పేరుతో దోపిడీ.. పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా ఫైర్!

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…

Thursday, 12 March 2026, 7:33 PM