Manchu Vishnu : కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు విష్ణు హీరోగా కొన్ని సినిమాలు సక్సెస్ అయినా అంతగా రాణించలేదు. మంచు విష్ణు సినిమా హిట్ కొట్టి చాలా ఏళ్లు అయింది. చివరగా ఆయన మోసగాళ్లు సినిమాలో కనిపించారు. అందులో కాజల్, మంచు విష్ణు అక్కా తమ్ముళ్లుగా కనిపించారు. ఇక ఈ మధ్య విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయి మరోసారి ఫామ్ లోకి వచ్చారు. ఇక ఈ ఎన్నికల సందర్బంగా జరిగిన ఇంటర్వ్యూల్లో మంచు విష్ణు చేసిన వాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ కు మెగాస్టార్ ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చింది. ఇక విష్ణు వీటి గురించి మాట్లాడుతూ నేను మా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడాలన్న ఆలోచన అసలు లేదు అయితే ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు వచ్చి అడిగారు. నేను నాన్నని సంప్రదిస్తే ఎందుకు ఇపుడు అని అన్నారు. ఆ తరువాత నీ ఇష్టం పోటీ చేయాలని అనుకుంటే చెయ్యి అన్నారు. అలా నేను ఎలక్షన్ లోకి దిగాను.
ఒకవేళ నాన్న వద్దు అనుంటే నాకు ఇష్టమైనా వదులుకునేవాడిని అంతే కానీ చిరంజీవి అయినా అయన వెనుక దేవుడు ఉన్నా నేను తగ్గను.. నాకు అందరి కంటే ముందు మా నాన్న. ఆయన మాట కచ్చితంగా పాటిస్తాను అన్నారు విష్ణు. ఇక రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచనతో విష్ణు మా ఎలక్షన్స్ లో పోటీ చేశాడు అన్న కామెంట్స్ కి స్పందిస్తూ.. నాకు రాజకీయాల్లోకి వెళ్లాలని ఉంటే నేను ఎప్పుడో వెళ్ళేవాడిని. మా నాన్న రాజ్యసభ మాజీ మెంబర్.
ఇపుడున్న ఏపీ సీఎం మా బావ, ఇక ఇక్కడున్న తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ తో మాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇంత బ్యాక్ గ్రౌండ్ పెట్టుకుని నేను మా ఎలక్షన్ ను నా రాజకీయ అరంగేట్రానికి వాడుకుంటానని అనుకోవడం వాళ్ల మూర్ఖత్వం అన్నారు. అప్పుడు విష్ణు అన్న ఈ మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్పూత్, సన్నీలియోన్ లు హీరోయిన్లుగా చేస్తున్నారు. అయితే అప్పటి మంచు విష్ణు కామెంట్స్ను ఇప్పుడు ఎందుకు వైరల్ చేస్తున్నారనే విషయం అర్థం కావడం లేదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…