Mega Heroes : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది మెగా హీరోలున్నారు. టాలీవుడ్ లో విడుదలయ్యే సినిమాల్లో దాదాపుగా మెగా హీరోలవే ఎక్కువగా ఉంటాయి. వీరంతా తమ సినిమాలను చాలా చక్కని ప్లానింగ్ తో షెడ్యూల్ చేసుకుంటారు. మెగా హీరోలు సినిమాలకు గ్యాప్ ఇస్తూ.. మెగా అభిమానుల్ని ఎంటర్ టైన్ చేస్తుంటారు. టాలీవుడ్ లో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ఒకే నెలలో నలుగురు మెగా హీరోల సినిమాలు రిలీజవ్వడం గమనార్హం.
డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గనీ సినిమా కూడా డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతోంది. క్రిస్మస్ స్పెషల్ గా 24న రిలీజ్ అవుతోంది.
అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా కలిసి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ కొన్ని రోజుల తేడాతో జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా 10 వేల స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
నెక్ట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా భీమ్లా నాయక్ జనవరి 12న రిలీజ్ కు ఫిల్మ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యాక 5 రోజుల తేడాతో భీమ్లా నాయక్ రిలీజ్ అవ్వడం అంటే మెగా అభిమానులకు పండగే.
ఏది ఏమైనా నెల రోజుల వ్యవధిలో మెగా హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి కనువిందు చేయనున్నాయి. ఇక ఇదే నెల రోజుల్లో టాలీవుడ్ స్టార్ హీరోలైన బాలకష్ణ నటించిన అఖండ, నాని శ్యామ్ సింగ రాయ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాలు కూడా రిలీజ్ అవనున్నాయి. దీంతో సినీ ప్రేక్షకులకు డిసెంబర్, జనవరి నెలల్లో అద్భుతమైన వినోదాన్ని పంచనున్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…