Allu Arjun : అల్లు అర్జున్‌ను మెగా ఫ్యాన్స్ దూరం పెట్టేశారా ? ఫొటోతో క్లారిటీ వ‌చ్చేసిన‌ట్లేనా ?

Allu Arjun : మెగా కుటుంబంలో అల్లు అర్జున్ రూటే వేరు. ఆయ‌న సినిమాలే కాదు.. వ్యాఖ్య‌లు కూడా భిన్నంగా ఉంటాయి. తాను ఇత‌ర హీరోల‌కు చెందిన సినిమా వేడుక‌ల‌కు వెళ్లినా.. లేదా త‌న సొంత సినిమా వేడుక అయినా స‌రే.. మెగా కుటుంబం గురించి పెద్ద‌గా మాట్లాడ‌రు. అందుక‌నే మెగా ఫ్యాన్స్ త‌ర‌చూ ఆయ‌న పాల్గొనే కార్య‌క్ర‌మాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరును చెప్పాల‌ని ప‌దే ప‌దే అరుస్తుంటారు. అయితే ఓ సంద‌ర్భంలో ఇలాగే అరిస్తే అల్లు అర్జున్ సీరియ‌స్ అయ్యాడు కూడా. అయితే అల్లు అర్జున్‌కు, మెగా ఫ్యామిలీకి మ‌ధ్య ఇటీవ‌లి కాలంలో దూరం పెరిగింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అందుకు బ‌లం చేకూర్చేలా తాజాగా ఓ కార్య‌క్ర‌మాన్ని కూడా ఫ్యాన్స్ నిర్వ‌హించారు. అందులో అల్లు అర్జున్ ప్ర‌స్తావ‌నే రాలేదు.

ఇటీవ‌ల ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు స్వామి నాయుడు ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ‌లో మెగా ఫ్యాన్స్ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌పై వారు చ‌ర్చించారు. ఈసారి ప‌వ‌న్‌ను ఎలాగైనా స‌రే సీఎంను చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకోవాల‌ని.. జ‌న‌సేన పార్టీని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాల‌ని.. వారు తీర్మానం చేశారు. అయితే ఆ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఒక‌టి ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది.

Allu Arjun

మెగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఒక ఫొటో ద‌ర్శ‌న‌మిచ్చింది. అందులో చిరంజీవి, నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, రామ్ చ‌ర‌ణ్ ఉన్నారు కానీ.. అల్లు అర్జున్ లేడు. దీంతో అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ దూరం పెట్టేశారా ? అన్న వార్త‌ల‌కు బ‌లం చేకూరిన‌ట్లు అయింది. గ‌తంలోనూ ఇలాంటి వార్త‌లే వ‌చ్చాయి. కానీ దీనిపై అటు అల్లు అర్జున్ కానీ.. ఇటు మెగా ఫ్యాన్స్ కానీ స్పందించ‌లేదు. అయితే ఇప్పుడు ఈ ఫొటో చూస్తే ఈ విష‌యం నిజ‌మేన‌ని అర్థ‌మ‌వుతోంది.

అయితే ఇది పూర్తిగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన మీటింగ్‌. ఇందులో చిరంజీవికి సంబంధం లేదు. కానీ రాజ‌కీయాలు అంటే ఇష్టం లేని చిరంజీవిని ఇందులో ఇన్వాల్వ్ ఎందుకు చేశార‌ని ఆయ‌న ఫ్యాన్స్ అంటున్నారు. వాస్త‌వానికి చిరంజీవి ఏపీలో జ‌గ‌న్‌తో స‌న్నిహితంగా ఉంటున్నారు. కానీ ప‌వ‌న్ మాత్రం జ‌న‌సేన‌పార్టీ త‌ర‌ఫున వైరం పెట్టుకుంటున్నారు. అలాంట‌ప్పుడు ప‌వన్ పొలిటిక‌ల్ కెరీర్ కోసం చిరంజీవి ఫొటోను వాడుకోవాల్సిన అవ‌స‌రం ఏముంది ? అన్న ప్ర‌శ్న వ‌స్తోంది. అయితే దీనిపై చిరంజీవి ఏమైనా స్పందిస్తారో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM