Allu Arjun : మెగా కుటుంబంలో అల్లు అర్జున్ రూటే వేరు. ఆయన సినిమాలే కాదు.. వ్యాఖ్యలు కూడా భిన్నంగా ఉంటాయి. తాను ఇతర హీరోలకు చెందిన సినిమా వేడుకలకు వెళ్లినా.. లేదా తన సొంత సినిమా వేడుక అయినా సరే.. మెగా కుటుంబం గురించి పెద్దగా మాట్లాడరు. అందుకనే మెగా ఫ్యాన్స్ తరచూ ఆయన పాల్గొనే కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పేరును చెప్పాలని పదే పదే అరుస్తుంటారు. అయితే ఓ సందర్భంలో ఇలాగే అరిస్తే అల్లు అర్జున్ సీరియస్ అయ్యాడు కూడా. అయితే అల్లు అర్జున్కు, మెగా ఫ్యామిలీకి మధ్య ఇటీవలి కాలంలో దూరం పెరిగిందనే వార్తలు వస్తున్నాయి. అందుకు బలం చేకూర్చేలా తాజాగా ఓ కార్యక్రమాన్ని కూడా ఫ్యాన్స్ నిర్వహించారు. అందులో అల్లు అర్జున్ ప్రస్తావనే రాలేదు.
ఇటీవల ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి నాయుడు ఆధ్వర్యంలో విజయవాడలో మెగా ఫ్యాన్స్ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో పవన్ కల్యాణ్ భవిష్యత్ ప్రణాళికపై వారు చర్చించారు. ఈసారి పవన్ను ఎలాగైనా సరే సీఎంను చేయాలని కంకణం కట్టుకోవాలని.. జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని.. వారు తీర్మానం చేశారు. అయితే ఆ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఒకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మెగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన మీటింగ్లో ఒక ఫొటో దర్శనమిచ్చింది. అందులో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ఉన్నారు కానీ.. అల్లు అర్జున్ లేడు. దీంతో అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ దూరం పెట్టేశారా ? అన్న వార్తలకు బలం చేకూరినట్లు అయింది. గతంలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి. కానీ దీనిపై అటు అల్లు అర్జున్ కానీ.. ఇటు మెగా ఫ్యాన్స్ కానీ స్పందించలేదు. అయితే ఇప్పుడు ఈ ఫొటో చూస్తే ఈ విషయం నిజమేనని అర్థమవుతోంది.
అయితే ఇది పూర్తిగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన మీటింగ్. ఇందులో చిరంజీవికి సంబంధం లేదు. కానీ రాజకీయాలు అంటే ఇష్టం లేని చిరంజీవిని ఇందులో ఇన్వాల్వ్ ఎందుకు చేశారని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. వాస్తవానికి చిరంజీవి ఏపీలో జగన్తో సన్నిహితంగా ఉంటున్నారు. కానీ పవన్ మాత్రం జనసేనపార్టీ తరఫున వైరం పెట్టుకుంటున్నారు. అలాంటప్పుడు పవన్ పొలిటికల్ కెరీర్ కోసం చిరంజీవి ఫొటోను వాడుకోవాల్సిన అవసరం ఏముంది ? అన్న ప్రశ్న వస్తోంది. అయితే దీనిపై చిరంజీవి ఏమైనా స్పందిస్తారో.. లేదో.. చూడాలి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…