Pawan Kalyan : జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి పవన్ కల్యాన్ అలుపెరగకుండా యాక్టివ్గా రాజకీయాల్లో పనిచేస్తూ వస్తున్నారు. అయితే ఆయన గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ రెండు చోట్లా ఓడారు. అయినప్పటికీ మనోధైర్యం కోల్పోకుండా ప్రజల మధ్య తిరుగుతూ వారి కష్ట నష్టాలను తెలుసుకుంటున్నారు. అయితే పవన్ తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రాజకీయంగా ఏదైనా సవాల్ విసిరితే దాన్ని స్వీకరిస్తారా.. అన్న ప్రశ్నకు పవన్ బదులిస్తూ.. సవాల్ విసిరిన వ్యక్తికి జ్ఞానం ఉందా.. ఎలాంటి ప్రశ్న వేశాడు.. అందులో న్యాయం ఉందా.. అనిపిస్తే తప్పక ఆ సవాల్ను స్వీకరిస్తానని చెప్పారు. ఇక ప్రస్తుతం తాను అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నానని.. వారి కష్ట నష్టాలను తెలుసుకుంటున్నానని.. దీంతో తనకు సరైన అవగాహన వస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలంటే ముందుగా వాటిని తెలుసుకోవాలని అన్నారు.
అయితే రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. ఈ సారి ఓడితే ఏం చేస్తారు.. అన్న ప్రశ్నలకు బదులిస్తూ.. రానున్న ఎన్నికల గురించి ఇంకా ఏమీ అనుకోలేదని.. అప్పటి పరిస్థితిని బట్టి తాను పోటీ చేసే స్థానాలను నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు. అలాగే రాజకీయాల్లో ఉన్నవారికి గెలుపోటములు సహజమని.. అంత మాత్రం చేత డీలా పడిపోవాల్సిన పనిలేదని.. ప్రజా సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాం.. కనుక అందులో కొనసాగాల్సిందేనని.. స్పష్టం చేశారు. ఈ క్రమంలో పవన్ వచ్చే ఎన్నికల్లో ఓడినా.. రాజకీయాల్లో కంటిన్యూ అవుతాననే విషయాన్ని చెప్పకనే చెప్పారు.
ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. అలాగే భవదీయుడు భగత్సింగ్ చిత్రంలోనూ పాల్గొంటారు. దీంతోపాటు తమిళ సినిమా వినోదయ సీతమ్ రీమేక్లోనూ నటించనున్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…