Meena : నటి మీనా తన భర్త విద్యాసాగర్ను ఈ మధ్యే కోల్పోయిన విషయం తెలిసిందే. ఆయన కరోనా బారిన పడి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ బాగా కావడంతో ఆయనను హాస్పిటల్లో చేర్పించారు. ఎన్నో రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందిన ఆయనకు లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పారు. కానీ దాతలు లభించకపోవడంతో ఆపరేషన్ చేయలేకపోయారు. ఫలితంగా ఆయన ఈ మధ్యే కన్నుమూశారు. అయితే మీనా భర్త చనిపోవడం అందరినీ షాక్కు గురి చేసింది. సినీ ఇండస్ట్రీ పెద్దలు, సీనియర్ నటులు మీనా ఇంటికి వెళ్లి ఆమెను ఓదార్చారు.
ఇక మీనా భర్త చనిపోవడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనకు రూ.250 కోట్ల ఆస్తి ఉందని, అయితే ఆస్తి తనకు దక్కడం లేదన్న కారణంతోనే మీనానే స్వయంగా తన భర్తను హత్య చేయించిందని వార్తలను ప్రచారం చేశారు. ముఖ్యంగా కోలీవుడ్ మీడియాలో ఈ వార్తలు ఎక్కువగా ప్రచారం అయ్యాయి. దీంతో స్పందించిన మీనా తాను భర్తను కోల్పోయిన బాధలో ఉన్నానని.. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని.. తనకు ప్రైవసీ కల్పించాలని ఆమె ఓ ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా కోరింది. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ ఇంకో విషయం తెరమీదకు వచ్చింది.
మీనా భర్త విద్యాసాగర్ తన ఆస్తినంతా కుమార్తె నైనిక పేరిట రాశారట. ఒక్క రూపాయి కూడా మీనాకు చెందకుండా వీలునామా రాశారట. నైనిక మేజర్ అవగానే ఆమెకు, ఆమె భర్తకు ఆస్తి చెందేట్లు ఆయన వీలునామాలో పేర్కొన్నారట. దీంతో మీనాపై అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే నైనిక మేజర్ అయ్యేవరకు గార్డియన్గా ఉండేవారు ఆస్తిని చూసుకోవాలని వీలునామాలో ఉందట. దీంతో విద్యాసాగర్.. మీనాకు షాకిచ్చాడని అంటున్నారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే. ఇందులో నిజం ఎంత ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…