Manchi Rojulochaie Review : మంచి రోజులొచ్చాయి మూవీ కోసం చిత్ర యూనిట్ ఇటీవలి కాలంలో అనేక ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. చిత్ర దర్శకుడు మారుతి, హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదాలు ఇటీవల బిగ్బాస్లోనూ కనిపించి సందడి చేశారు. ఈ మూవీ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు ఓ లుక్కేద్దామా..!
గోపాల్ తిరుమలశెట్టి (అజయ్ ఘోష్)కు కూతురు పద్మ (మెహ్రీన్) అంటే ప్రాణం. ఆమెను ఎప్పుడూ భద్రంగా చూసుకుంటుంటాడు. ఈ క్రమంలో సంతు (సంతోష్ శోభన్), పద్మ డీప్ గా లవ్లో మునిగి తేలుతుంటారు. అయితే ఈ విషయం గోపాల్కు అతని స్నేహితుల ద్వారా తెలుస్తుంది. వారు అతన్ని భయపెడతారు. నీ కూతరు వల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది, జాగ్రత్త.. అని హెచ్చరిస్తారు. దీంతో గోపాల్ అప్ సెట్ అయి కుమార్తె పట్ల మరింత కేర్ తీసుకుంటుంటాడు. అయితే తన మామను సంతు ఎలా మేనేజ్ చేశాడు, ఆయన ఆశీర్వాదాలు లభించాయా ? తన లవ్ను సక్సెస్ చేసుకున్నాడా ? అన్న విషయాలు తెలియాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
నిజ జీవితానికి సంబంధించిన పాయింట్లను తీసుకుని దర్శకుడు మారుతి సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. ఇక ఇందులోనూ అదే విధంగా ఓ పాయింట్ తీసుకున్నాడు. అది భయం. ఆడపిల్ల తండ్రికి సహజంగానే ఉండే భయాన్ని ఇందులో చూపించారు. దీంతోపాటు చక్కని కామెడీని కూడా వర్కవుట్ చేశారు. మెహ్రీన్, అజయ్ ఘోష్, సంతోష్ శోభన్, వెన్నెల కిశోర్, ప్రవీణ్, వైవా హర్ష, సుధాకర్ వంటి వారు తమ పాత్రల పరిధి మేర బాగానే నటించి అలరించారు.
సినిమాను నిజానికి 2 గంటల్లోపే ముగించవచ్చు. కానీ 20 నిమిషాలను పొడిగించారు. దీంతో సినిమా కాస్త నెమ్మదిగా నడుస్తుందన్న భావన కలుగుతుంది. అలాగే కరోనా యాంగిల్ను సినిమాలో చొప్పించారు. కానీ అదంత పెద్ద ప్రభావాన్ని చూపించలేదనే చెప్పాలి. ఇక మూవీ క్లైమాక్స్ కూడా ముందుగా ఊహించినట్లే ఉంటుంది. పెద్ద ట్విస్టులు ఏమీ ఉండవు. అందువల్ల యావరేజ్ అన్న ఫీలింగ్ వస్తుంది.
అయితే ప్రొడక్షన్ విలువలు, మ్యూజిక్, డైలాగ్లు బాగున్నాయి. కెమెరా వర్క్ కూడా బాగానే ఉంది. దర్శకుడు మారుతి సహజంగానే కామెడీ ఎంటర్టైనర్ జోనర్లో సినిమాలు తీస్తారు. కనుక కామెడీని, చక్కని వినోదాన్ని కోరుకునే వారు ఈ మూవీని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. ఆ జోనర్లు అంటే ఇష్టపడే వారు కచ్చితంగా ఈ మూవీని ఒకసారి చూడవచ్చు. వీకెండ్లో సరదాగా ఈ మూవీని చూసి నవ్వుకోవచ్చు.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…