iPhone : ఆన్ లైన్ లో ఫోన్లను ఆర్డర్ చేస్తే సబ్బు బిళ్లలు, ఇటుకలు వచ్చిన సంఘటనలను మనం గతంలో ఎన్నో చూశాం. అయితే అలాంటి మోసాలను ఎక్కువగా డెలివరీ బాయ్స్ చేసేవారు. కనుక వాటికి చెక్ పెట్టేలా ఈ-కామర్స్ సంస్థలు పకడ్బందీగా చర్యలను తీసుకుంటున్నాయి. ఇక ఇటీవలి కాలంలోనే ఓ కొత్త సదుపాయాన్ని ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులకు అందిస్తున్నాయి. దాంతో డెలివరీ అయ్యే సమయంలోనే బాక్స్ను వినియోగదారులు డెలివరీ బాయ్ సమక్షంలోనే ఓపెన్ చేసి చూడవచ్చు.
అలా ఓపెన్ చేశాక వస్తువు ఉంటే ఓకే.. లేదంటే దాన్ని అలాగే అప్పటికప్పుడే రిటర్న్ పంపి రీఫండ్ పొందవచ్చు. నిజానికి ఇది ఎంతో మంచి సదుపాయం. కానీ ఇలా ఉన్నప్పటికీ తాజాగా ఓ వ్యక్తికి ఐఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బు బిళ్ల వచ్చింది. వివరాల్లోకి వెళితే..
కేరళలోని కొచ్చి పట్టణానికి చెందిన నూరుల్ అమీన్ ఇటీవల అమెజాన్ లో ఐఫోన్-12 బుక్ చేశాడు. రూ. 70,900 ముందుగానే చెల్లించాడు. అమెజాన్ పే ద్వారా చెల్లింపు చేశాడు. ఈ క్రమంలో అమెజాన్ డెలివరీ బాయ్ ఫోన్ ను ఇవ్వగా.. దాన్ని నూరుల్ ఓపెన్ చేసి చూశాడు. అందులో విమ్ బార్ ఉంది. దీంతో షాకైన నూరుల్ వెంటనే దాన్ని అలాగే ఆ డెలివరీ బాయ్తో తిప్పి పంపేశాడు.
అయితే ఐఫోన్ 12 ఫోన్లు తమ వద్ద స్టాక్ లేనందున అతను చెల్లించిన మొత్తాన్ని అమెజాన్ రీఫండ్ చేసింది. ఈ క్రమంలో అసలు పొరపాటు ఎక్కడ జరిగిందో విచారించే సరికి.. షాక్ లాంటి నిజం బయట పడింది. ఆ ఫోన్కు చెందిన ఐఎంఈఐ ద్వారా ట్రేస్ చేయగా.. దాన్ని జార్ఖండ్లో ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. అయితే నిజానికి ఆఫోన్ సెప్టెంబర్ నుంచే వినియోగంలో ఉంది. కానీ దాన్ని అక్టోబర్లో అమ్మకానికి పెట్టారు. అంటే.. ఉద్దేశపూర్వకంగానే ఎవరో వాడుతున్న ఫోన్ను అమ్మకానికి పెట్టారు. కానీ ఫోన్ను అందులో ఉంచకుండా.. విమ్ బార్ పెట్టారు. దీంతో ఆ బాక్స్ అలాగే డెలివరీ అయింది. అంటే.. ఇది డెలివరీ బాయ్ తప్పిదం కాదని, అమ్మకం దారు తప్పిదమేనని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈ తరహా మోసాలకు ఈ-కామర్స్ సంస్థలు ఎలా చెక్ పెడతాయో చూడాలి.
ఏది ఏమైనా.. మీరు కూడా ఆన్లైన్లో ఫోన్కు ఆర్డర్ పెడితే.. డెలివరీ బాయ్ ఎదుటే బాక్స్ ఓపెన్ చేసేలా సదుపాయాన్ని ఎంచుకోండి. లేదంటే ఇబ్బందులు ఏర్పడితే ఇచ్చిన సొమ్ము మొత్తం వెనక్కి వచ్చేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…