ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్త బెంగళూరులోని ఓ విలాసవంతమైన రిసార్ట్లో ఉంటూ కొన్ని రోజుల తరువాత బిల్లు చెల్లించకుండానే ఎగ్గొట్టి పారిపోయాడు. మొత్తం రూ.3.20 లక్షల బిల్లును అతను చెల్లించకుండానే వెళ్లిపోయాడని రిసార్ట్ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలోని పుట్టపర్తికి చెందిన కే రాజేష్ అనే వ్యక్తి బెంగళూరు రూరల్ జిల్లాలో ఉన్న దేవనహల్లిలోని ఓ విలాసవంతమైన రిసార్ట్కు తరచూ వస్తుంటాడు. అతను రెగ్యులర్ కస్టమర్. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట నెలల తరబడి రిసార్టులోనే ఉంటుంటాడు. ఈ క్రమంలోనే అతను గత జూలై 23న రిసార్టుకు వచ్చాడు. అప్పటి నుంచి అక్కడే ఓ సింగిల్ రూమ్ తీసుకుని ఉంటున్నాడు.
ఒక్క రోజు రూమ్ చార్జిలు రూ.7,850 కాగా అతను మొన్నీ మధ్యే నవంబర్ 2వ వారం వరకు ఉన్నాడు. అయితే సెప్టెంబర్ వరకు బిల్లులను సరిగ్గానే చెల్లించాడు. రూ.8 లక్షలను చెల్లించాడు. అనంతరం తాను ఇంకొన్ని రోజుల పాటు ఉంటానని చెప్పడంతో నమ్మకమైన రెగ్యులర్ కస్టమరే కదా అని చెప్పి రిసార్ట్ వారు కూడా అతన్ని అడ్వాన్స్ అడగకుండానే రూమ్ రెంట్ గడువును పొడిగించారు. ఈ క్రమంలో ఇటీవలే అతను ఓ రోజు రిసార్ట్ నుంచి వెళ్లిపోయి ఇంక తిరిగి రాలేదు.
అతను కొన్నిసార్లు లాంగ్ డ్రైవ్ వెళ్లి వస్తుంటాడు. కనుక 1, 2 రోజుల పాటు వారు అతని గురించి పట్టించుకోరు. కానీ ఈసారి వెళ్లి మళ్లీ రిసార్ట్కు రాలేదు. చూస్తే ఖాళీ చేసినట్లు అర్థమైంది. దీంతో అతను రూ.3.20 లక్షల బిల్లు చెల్లించకుండానే పారిపోయాడని రిసార్ట్ వారు గ్రహించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…