ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్త బెంగళూరులోని ఓ విలాసవంతమైన రిసార్ట్లో ఉంటూ కొన్ని రోజుల తరువాత బిల్లు చెల్లించకుండానే ఎగ్గొట్టి పారిపోయాడు. మొత్తం రూ.3.20 లక్షల బిల్లును అతను చెల్లించకుండానే వెళ్లిపోయాడని రిసార్ట్ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలోని పుట్టపర్తికి చెందిన కే రాజేష్ అనే వ్యక్తి బెంగళూరు రూరల్ జిల్లాలో ఉన్న దేవనహల్లిలోని ఓ విలాసవంతమైన రిసార్ట్కు తరచూ వస్తుంటాడు. అతను రెగ్యులర్ కస్టమర్. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట నెలల తరబడి రిసార్టులోనే ఉంటుంటాడు. ఈ క్రమంలోనే అతను గత జూలై 23న రిసార్టుకు వచ్చాడు. అప్పటి నుంచి అక్కడే ఓ సింగిల్ రూమ్ తీసుకుని ఉంటున్నాడు.
ఒక్క రోజు రూమ్ చార్జిలు రూ.7,850 కాగా అతను మొన్నీ మధ్యే నవంబర్ 2వ వారం వరకు ఉన్నాడు. అయితే సెప్టెంబర్ వరకు బిల్లులను సరిగ్గానే చెల్లించాడు. రూ.8 లక్షలను చెల్లించాడు. అనంతరం తాను ఇంకొన్ని రోజుల పాటు ఉంటానని చెప్పడంతో నమ్మకమైన రెగ్యులర్ కస్టమరే కదా అని చెప్పి రిసార్ట్ వారు కూడా అతన్ని అడ్వాన్స్ అడగకుండానే రూమ్ రెంట్ గడువును పొడిగించారు. ఈ క్రమంలో ఇటీవలే అతను ఓ రోజు రిసార్ట్ నుంచి వెళ్లిపోయి ఇంక తిరిగి రాలేదు.
అతను కొన్నిసార్లు లాంగ్ డ్రైవ్ వెళ్లి వస్తుంటాడు. కనుక 1, 2 రోజుల పాటు వారు అతని గురించి పట్టించుకోరు. కానీ ఈసారి వెళ్లి మళ్లీ రిసార్ట్కు రాలేదు. చూస్తే ఖాళీ చేసినట్లు అర్థమైంది. దీంతో అతను రూ.3.20 లక్షల బిల్లు చెల్లించకుండానే పారిపోయాడని రిసార్ట్ వారు గ్రహించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…